రూ.4 వేలకే ల్యాప్టాప్.. జనం ఎగబడడంతో గందరగోళం !!
మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ల్యాప్టాప్లకు డిమాండ్ పెరుగుతోంది. విద్యార్థులు, ఫ్రీలాన్సర్లు, వర్క్ ఫ్రం హోమ్ ప్రొఫెషనల్స్ వంటి వర్గాలకు ల్యాప్టాప్ల అవసరం గట్టిగా ఉంటుంది. సాధారణంగా దీని ధర రూ.20 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇక బ్రాండ్ను బట్టి ధర మారుతుంది. అయితే ఆర్ధికంగా అంత వెచ్చించలేని వారు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్లు కొనుగోలు చేస్తూ ఉంటారు.
రూ.4 వేలకే ల్యాప్టాప్..
అయితే ఇప్పుడు ప్రముఖ సంస్థలు సైతం ఫెస్టివల్ సీజన్ అంటూ ఒక్కోసారి ఒక్కో ఆఫర్ ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లోని ఓ ఎలక్ట్రానిక్ షాపు యాజమాన్యం రూ.4 వేలకే ల్యాప్టాప్ అంటూ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా జోరుగా ప్రచారం చేసింది. ఈ విషయం కాస్త వైరల్ కావడంతో.. ఉదయం నుంచే షాపు ముందు జనం క్యూ కట్టారు. దీంతో రద్దీ ఎక్కువ అయ్యి కస్టమర్లు క్యూ కట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని షాపును మూసివేయించారు. ప్రచారం కోసం ఇలా జనాల ప్రాణాలతో చెలగాటం ఆదుకోవద్దంటూ షాపు యజమానులను పోలీసులు హెచ్చరించారు. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు. అలానే ప్రజలు సోషల్ మీడియలో వచ్చే ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ఈ తరహా వస్తువులను కొనుగోలు చేయకపోవడమే మంచిదని స్పష్టం చేశారు. మొత్తంగా ఈ తరహా చవక ఆఫర్లను గుడ్డిగా నమ్మి వెళితే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
సామ్సంగ్ నుంచి కొత్త A-సిరీస్ ఫోన్స్.. దుమ్మురేపుతున్న ఫీచర్స్ !! -
విశ్వాసం అంటే ఇది.. రూ.5 బిస్కెట్ ప్యాకెట్ వేస్తే 130కి.మీ వెంట నడిచిన శునకం! -
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం.. -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం.. పని వేళలు పొడిగింపు -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇండియన్ మార్కెట్లోకి " టెక్నో " కొత్త 5G ఫోన్..!












Click it and Unblock the Notifications