కేజ్రీవాల్ కావొద్దని కేసీఆర్కు హెచ్చరిక: కేంద్రమంత్రి సదానందకు షాకిచ్చారు
హైదరాబాద్: కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడకు జడ్డిలు, న్యాయవాదులు బుధవారం నాడు షాకిచ్చారు. ఏకంగా వారు కేంద్రమంత్రి పైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు పలువురు రంగారెడ్డి న్యాయవాదులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆయన పైన ఫిర్యాదు చేశారు.
'తెలంగాణని ఏలేందుకు బాబు కొత్త కుట్ర!', ఆ జడ్జిలు వీరే (పిక్చర్స్)
గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హైకోర్టు విభజన పైన హామీ ఇచ్చారని, ఇప్పుడు దానిని నెరవేర్చడం లేదని ఫిర్యాదు చేశారు. ఆయన మాట తప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసీఆర్ జంతర్ మంతర్ వద్ద మరో కేజ్రీవాల్ కావొద్దని సదానంద హెచ్చరించిన విషయం తెలిసిందే.

కాగా, తెలంగాణ న్యాయాధికారుల సంఘం నేతలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ మంగళవారం ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల జేఏసీ చేపట్టిన మొదటి కోర్టు విధుల బహిష్కరణ ఉద్రిక్తంగా మారింది.
వాటిని చూడండి, హైకోర్టు తర్వాతే ఏదైనా: కేంద్రానికి కేసీఆర్ చురక
హైకోర్టు ప్రాంగణంలోకి న్యాయవాదుల ప్రవేశాలపై అంక్షలు విధించడం, కోర్టు హాల్లోకి వెళ్తున్న సహాయ ప్రభుత్వ న్యాయవాదులు(ఏజీపీ)లను నిరోధించడంతోపాటు తెలంగాణ న్యాయవాదులను అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత కనిపించింది.
భద్రత మధ్య తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ దిలీప్ బీ భోసలే ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం విధులను నిర్వహించింది. ఏజీపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకోవడంతో వివాదం కొద్దిగా సద్దుమణిగినప్పటికీ, మిగతా న్యాయవాదులను పోలీస్ స్టేషన్కు తరలించారు.

మరోవైపు మంగళవారం మరికొందరు తెలంగాణ న్యాయాధికారులసంఘం నేతలను హైకోర్టు సస్పెండ్ చేయడంపై న్యాయవాదులు మండిపడ్డారు. సస్పెన్షన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా బుధవారం పూర్తిస్థాయిలో హైకోర్టు విధులను బహిష్కరించాలని సంఘం నిర్ణయం తీసుకున్నది. నగరంలోని న్యాయవాదులు హైకోర్టుకు తరలిరావాలని సంఘం అధ్యక్షుడు గండ్ర మోహన్రావు పిలుపునిచ్చారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications