మీరు ఏం చేయలేదు, మా కాలనీకి రాకండి: టీఆర్ఎస్ ప్రచార రథం అడ్డగింత
హైదరాబాద్: ఎల్బీ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దగోని రామ్మోహన్ గౌడ్కు ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ఆయన ప్రచారరథాన్ని స్థానికులు అడ్డుకున్నారు. తమ కాలనీకి రావొద్దని అడ్డుకున్నారు. ఫ్లెక్సీని చించివేశారు.
ఆరోసారి: సిద్దిపేట నుంచి హరీష్ రావు గెలిస్తే జాతీయ రికార్డ్, కీలక నేతల రికార్డులు ఇవీ
బాలాపూర్ మండలం శివాజీ చౌక్ డీఆర్డీఎల్ రోషన్ దౌలాలో ఈ సంఘటన జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు ఎలాంటి పథకాలు అందలేదని, అలాగే ఎప్పుడో ఒకసారి కనిపిస్తున్నారని మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఏం చేయలేదన్నారు.
ఖమ్మం జిల్లాలో వినూత్న నిరసన
ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం ముజాహిపురం, సుద్దవాగు తండాల ప్రజలు వినూత్న నిరసన తెలిపారు. తమ రెండు గ్రామాల్లో తాగునీరు, సాగునీరు సమస్యను పరిష్కరించలేదని, రోడ్లు, బస్సు సౌకర్యం కల్పించలేదని మండిపడిన గ్రామస్తులు.. ఓట్లు అడిగేందుకు తమ గ్రామంలోకి ఏ పార్టీ నేతలు రావొద్దని ఫ్లెక్సీ కట్టారు. నిరసన తెలిపి నినాదాలు చేశారు. తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.