చంద్రబాబు వెళ్లిపోయేలా చూడాలని అల్లాను ప్రార్థించా: డిప్యూటీ సిఎం
నల్లగొండ: తెలంగాణకు పట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాకా చంద్రబాబు నాయుడి గ్రహణం వీడాలని అల్లాను ప్రార్థిస్తున్నానని తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. బంగారు తెలంగాణకు బాబు అవరోధంగా మారారని అన్నారు.
అభివృద్ధి పనులకు అడుగడుగునా అడ్డుపడుతున్న చంద్రబాబు తక్షణమే రాష్ట్రం విడిచి పోయేలా చూడాలని అల్లాను వేడుకుంటున్నానని డిప్యూటీ సీఎం అన్నారు. నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని మసీద్ల మరమ్మతు కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.55 లక్షల చెక్కులను యాదగిరిగుట్టలో సోమవారం అందజేసి మాట్లాడారు.

రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ముందుకు సాగుతుం డగా, అనేక అడ్డంకులు సృష్టిస్తూ రాష్ర్టాభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబు తన పద్ధతి మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రం విడిచి పోతే హర్షిస్తామని అన్నారు.
తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రం అవుతుందన్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications