చర్లపల్లి జైలులో మావోయిస్టు ఖైదీల దీక్ష
హైదరాబాద్ : మావోయిస్టుల బంద్ కు మద్దతుగా చర్లపల్లి జైలులో దీక్షలు సాగుతున్నాయి. ఏఒబీలో జరిగిన ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ మావోయిస్టులు గురువారం నాడు బంద్ కు పిలుపునిచ్చారు.ఈ బంద్ కు మద్దతుగా చర్లప్లి జైలులో ఉన్న మావోయిస్టు ఖైదీలు, వారి సానుభూతిపరులు దీక్ష చేస్తున్నారు.
ఏఓబిలో పది రోజుల క్రితం జరిగిన ఎన్ కౌంటర్ లో 32 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఎన్ కౌంటర్ ఘటన జరిగిన నాటి నుండి మావో అగ్రనేతలు రామకృష్ణ, గాజర్ల రవి, చలపతిల ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకొంటామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

ఈ ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఇచ్చిన బంద్ కు సంఘీభావంగా చర్లపల్లి జైలులో ఉన్న మావోయిస్టు ఖైదీలు గురువారం నాడు అన్న పానీయాలు మానివేసి దీక్షకు దిగారు.
మావోయిస్టు భైదీలు కోబాడ్ గాంధీ, వారణాసి సుబ్రమణ్యం లతో పాటు మావోల సానుభూతిపరులైన మరో 40 మంది ఖైదీలు కూడ ఈ దీక్షలకు సంఘీభావాన్ని ప్రకటించారు.












Click it and Unblock the Notifications