హైదరాబాద్ లో గజిబిజి గందరగోళానికి పుల్ స్టాప్: రూ.4,051 కోట్లతో భారీ ప్రాజెక్ట్
సుదీర్ఘకాలంగా హైదరాబాద్ అత్యంత సమస్యాత్మంగా మారిన ఓవర్ హెడ్ విద్యుత్ తీగలను భూగర్భ కేబులింగ్గా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాలుగు మెట్రో జోన్లలో విద్యుత్ పంపిణీ మౌలిక సదుపాయాలలో భారీ మార్పులను తీసుకుని రానుంది. భూగర్భ విద్యుత్ వ్యవస్థ కోసం 4,051 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టును ప్రభుత్వం ఆమోదించింది. దశలవారీగా ఈ పనులు కొనసాగనున్నాయి. ఇకపై నగరంలో ఓవర్ హెడ్ విద్యుత్ కేబుళ్ల కనిపించవు.
సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో 3,899 కిలోమీటర్ల ఓవర్హెడ్ లైన్లను భూగర్భ కేబుల్స్గా మారతాయి. ఇందులో 33, 11 కేవీ, లో- ఓల్టేజీ లైన్లు ఉన్నాయి. బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ నాలుగు కీలక మెట్రో జోన్ల పరిధిలో ఈ పనులు అమలు కానున్నాయి. ఆయా ప్రాంతాలన్నీ కూడా జనసమ్మర్థంతో కూడుకుని ఉన్నవి కావడం, ఓవర్ హెడ్ లైన్ల వల్ల నిర్మాణ సంబంధిత ఇబ్బందులు తలెత్తుతున్నందున తొలుత ఆయా జోన్లను ప్రభుత్వం ఎంపిక చేసింది.

ఈ 4,051 కోట్ల రూపాయల నిధులను సదరన్ డిస్కమ్ సొంతంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. తన అంతర్గత నిధులు లేదా రుణాల ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై తక్షణ బడ్జెట్ కేటాయింపుల అవసరం ఉండదు. ఆ భారం కూడా పడదు. కాలక్రమేణా దశలవారీగా వివిధ టారిఫ్లను పెంచడం, అంతర్గతంగా నిధులను సమీకరించుకోవడం ద్వారా ఖర్చులను తిరిగి రాబట్టుకోవడానికి ఎస్పీడీసీఎల్ వీలు కలుగుతుంది.
ఈ ప్రాజెక్ట్ లో టెలికాం/ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టీ- ఫైబర్ సంస్థలు ఖర్చు పంచుకుంటాయి. ఈ భూగర్భ కేబులింగ్ పనుల్లో ఆయా సంస్థలు కూడా భాగస్వామ్యం కావాల్సి ఉంటుందని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. ఆయా సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యం కావడం వల్ల సదరన్ డిస్కమ్ పై మొత్తం ప్రాజెక్టు వ్యయం తగ్గుతుంది. భవిష్యత్తులో రోడ్ల తవ్వకాలు, వాటికి సంబంధించిన అంతరాయాలు తగ్గుతాయి. విద్యుత్, టెలికాం రెండింటికీ ఏకీకృత భూగర్భ యుటిలిటీ నెట్వర్క్ ఏర్పడుతుంది.
ఈ భూగర్భ కేబులింగ్ ప్రాజెక్టు అనేక ప్రయోజనాలను ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంటోంది. ఓవర్ హెడ్ వైర్లు లేకపోవడం వల్ల నగరం అందంగా మారుతుంది. వాతావరణ సంబంధిత అంతరాయాలు తగ్గుతాయి. ఎక్కడికక్కడ విద్యుత్ తీగలు తొలగిపోవడం వల్ల భద్రత మరింత మెరుగుపడుతుంది. విద్యుత్ ప్రమాదాలు తగ్గుతాయి. బంజారాహిల్స్ వంటి విలాసవంతమైన ప్రాంతాలు గజిబిజి కేబుళ్ల గందరగోళం ఉండదు.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications