హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియుడితో వీడియో కాల్ మాట్లాడుతూ ఎంబీయే విద్యార్థిని ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య వెనుక ఇన్ని కోణాలా ?

హైదరాబాద్: కొంపల్లిలో ఎంబీయే సెకండియర్ చదువుతున్న విద్యార్థిని హనీషా చౌదరి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన ప్రియుడితో వీడియో కాల్ మాట్లాడుతూనే ఈ చర్యకు పాల్పడింది. హనీషాది అనంతపురం జిల్లా. బుగ్గయ్య చౌదరి కూతురుగా గుర్తించారు.

చదవండి: ఉప్పల్ నరబలి కేసులో విస్తుగొలిపే నిజాలు: రాజశేఖర్ ఆటకట్టించిన 'సూపర్' టెక్నాలజీ

కొంపల్లిలోని శివశివానీ కాలేజీలో ఎంబీయే చదువుతోంది. హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్న హనీషా.. అంతకుముందు ప్రియుడు దక్షిత్ పటేల్‌తో వీడియో కాల్‌లో మాట్లాడింది. వీడియో కాల్‌లో అతను చూస్తుండగానే ఉరేసుకుంది.

MBA girl student commits suicide in Hyderabad

దీంతో అతను వెంటనే హాస్టల్ గదికి వచ్చాడు. లోపల గడియపెట్టి ఉండటంతో తలుపులు బద్దలు కొట్టాడు. హనీషాను ఆమె స్నేహితురాలి సాయంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. కానీ ఆలోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని గాంధీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో ఈ విషయం గుర్తించామని, స్కైప్ ద్వారా బాయ్ ఫ్రెండుతో మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆమె డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

English summary
In a shocking incident, a 23-year-old girl student ended her life by hanging from a ceiling fan at her college hostel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X