దుర్మార్గుడు: బైక్పై తీసుకెళ్లి అమ్మాయిపై మెకానిక్ రేప్
ఓ బైక్ మెకానిక్ అభం శుభం తెలియని అమ్మాయిపై అత్యాచారం చేశాడు. చాక్లెట్లు ఆశపెట్టి తీసుకుని వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్: ఓ బాలికపై బైక్ మెకానిక్ అత్యాచారం చేశాడు. చాక్లెట్లు ఇస్తానని బైక్పై ఎక్కించుకుని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి 8 ఏళ్ల బాలికపై అతను అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అతనిపై నిర్భయ కేసు నమోదు చేశారు.
ఈ సంఘటన ఈనెల 9వ తేదీ మధ్యాహ్నం సమయంలో మన్సూరాబాద్ ప్రాంతంలో గల ఓ బస్తీలో జరిగింది. ఆ రోజు బాలిక(8) తమ్ముళ్లతో ఇంట్లో ఆడుకుంటోంది. సమీప బస్తీలో నివసిస్తున్న రాకేష్రెడ్డి(19) బాలికకు మాయమాటలు చెప్పి బైక్పై బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
కూలిపనికెళ్లిన తల్లి మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చారు. ఆ సమయంలో కూతురు కనిపించకపోవడంతో పరిసరాల్లో తల్లిదండ్రులు గాలించారు. ఆ సమయంలో అతడు బాలికను బైక్పై తీసు కొచ్చాడు. ఎక్కడికి తీసుకెళ్లావని బాలిక తల్లిదండ్రులు అడగితే బైక్ విడిచిపెట్టి పారిపోయాడు.
ఏం జరిగిందని కూతురిని తల్లిదండ్రులు అడగగా.. చెట్లపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని చెప్పింది. అదేరోజు రాత్రి వారు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకుని ఫోక్సో, నిర్భయ కేసులు నమోదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.