ఓటింగ్ సిరాచుక్క మిడిల్ ఫింగర్కు చేరింది.. బూతులా మీనింగ్ మారింది.. నెట్టింట్లో కాంట్రవర్సీ
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో లోక్సభ వరకే ఎన్నికలు జరుగుతున్నా.. మరికొన్ని ప్రాంతాల్లో ఇతరత్రా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికల మొదలు పరిషత్ ఎన్నికల వరకు ఓట్ల పండుగ సందడి అంతా ఇంతా కాదు. గత డిసెంబరులో ప్రారంభమైన ఎన్నికల హడావిడి.. అలా వరుసగా కొనసాగుతూనే ఉంది. అయితే పరిషత్ ఎన్నికల వేళ ఎడమచేతి చూపుడు వేలుకు వేసే సిరాచుక్కను మిడిల్ ఫింగర్కు వేస్తున్నారు. దాంతో మధ్యన వేలుకు పెట్టిన సిరాచుక్కతో కొందరు యువకులు సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం భిన్న రకాల కామెంట్లకు దారితీస్తోంది.

మొన్ననే లోక్సభ ఎన్నికలు.. వెంటనే పరిషత్ ఎలక్షన్లు
తెలంగాణలో ఓట్ల పండుగ నడుస్తోంది. ఒక్కరోజో, రెండు రోజులో కాదు.. దాదాపుగా ఆర్నెళ్ల నుంచి అదే పరిస్థితి. గత డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దాని వెంటే జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అదలావుంటే ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు జరిగితే.. మళ్లీ వెంటనే పరిషత్ (జడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికలు తెరపైకి వచ్చాయి. అయితే లోక్సభ ఎన్నికలకు, పరిషత్ ఎన్నికలకు మధ్య వ్యవధి చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఓటర్ల ఎడమచేతి చూపుడువేలుకు పెట్టే సిరాచుక్కను మిడిల్ ఫింగర్కు పెట్టాలని జారీ చేసింది.

ఎన్నికల సీజన్.. చెరిగిపోని గుర్తు
సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా ఓటు వేశాక ఓటర్ల ఎడమచేతి చూపుడువేలుకు సిరాచుక్క పెట్టడం ఆనవాయితీ. ఒక్క ఓటర్ ఒకే ఓటు వేసే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఫాలో అవుతున్న నిబంధన ఇది. అలా ఓటర్లకు వేసిన సిరాచుక్క చాలారోజుల వరకు అలాగే ఉంటుంది. దాన్ని ఎలా చెరిపి వేయాలని చూసినా పోవడం కష్టమే. అయితే లోక్సభ ఎన్నికలు జరిగి నెల రోజులు కూడా కాలేదు. అప్పుడు ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల చేతి వేళ్లకు ఇంకా సిరాచుక్క అలాగే ఉండిపోయింది. దాంతో ఈసారి పరిషత్ ఎన్నికల్లో ఎడమచేతి మిడిల్ ఫింగర్కు సిరాచుక్క వేయాలని ఎన్నికల సంఘం అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీచేసింది.

వేలు మారింది.. మీనింగ్ మారింది
సిరాచుక్క వేలు మారడంతో సోషల్ మీడియాలో భిన్న రకాల కామెంట్లు వస్తున్నాయి. కొందరు ఓటు వేశాక సెల్ఫీలు దిగి ఫోటోలు పోస్టు చేస్తుండటంతో వారి ఫ్రెండ్స్ ఒక్కోరకంగా రియాక్ట్ అవుతున్నారు. ఎడమచేతి మిడిల్ ఫింగర్కు సిరాచుక్క (సెల్ఫీలో మాత్రం రైట్ హ్యాండ్ గా చూపిస్తుంది) ఉండటంతో రకరకాలుగా కామెంటుతున్నారు. అయితే మధ్యన వేలు చూపించడమనేది బూత్ మీనింగ్ అర్థం వచ్చేలా ఉండటంతో అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో కాంట్రావర్సీ టాపిక్ అవుతోంది.
ఇక ఓటు వేశామనే ఆనందంతో ఉన్న కొత్త ఓటర్లు తాము పెట్టిన సెల్ఫీ పోస్టులకు వస్తున్న కామెంట్లు చూసి కంగుతింటున్నారు. ఈ మిడిల్ ఫింగర్ తంటా ఏందిరా నాయనా అనుకుంటూ నిట్టూర్పు వదులుతున్నారు. ఇంకా కొంతమంది యువకులు మామా టెకీట్ ఈజీ అంటూ రిప్లై కూడా ఇస్తుండటం గమనార్హం. మొత్తానికి పరిషత్ ఎన్నికల వేళ మిడిల్ ఫింగర్ సిరాచుక్క అలా అలా బూత్ మీనింగుకు పరాకాష్టలా మారింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications