ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దుండగుల దాడి.. రాళ్ళు రువ్వి ఆపై..!!
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆయన నివాసంపై దాడి చేసిన దుండగులు రాళ్లు రువ్వి కిటికీల అద్దాలు పగలగొట్టారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. న్యూఢిల్లీలోని అశోకా రోడ్ ప్రాంతంలోని ఆయన నివాసంపై దాడి చేసిన దుండగులు రాళ్లు రువ్వి కిటికీల అద్దాలు పగలగొట్టారు. ఢిల్లీ లోని ఆయన నివాసం పై ఈ తరహా దాడి చెయ్యటం ఇది నాలుగోసారి.
My Delhi residence has been attacked again. This is the fourth incident since 2014. Earlier tonight, I returned from Jaipur & was informed by my domestic help that a bunch of miscreants pelted stones that resulted in broken windows. @DelhiPolice must catch them immediately pic.twitter.com/vOkHl8IcNH
— Asaduddin Owaisi (@asadowaisi) February 19, 2023
తన నివాసంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. తాను రాజస్థాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లకముందే ఈ దాడి జరిగినట్టుగా పేర్కొన్న ఆయన, దాడి ఘటనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. నిన్న సాయంత్రం ఈ దాడి జరిగినట్టుగా పేర్కొన్న ఆయన, 2014 సంవత్సరం నుండి ఇప్పటివరకు ఈ విధమైన దాడి ఘటనలు జరగడం నాలుగవసారి అంటూ వెల్లడించారు.

ఘటన జరిగిన సమయంలో తాను జైపూర్ లో ఉన్నానని, దాడి గురించి తన ఇంట్లో పనిచేసే పనిమనిషి తనకు తెలియజేసినట్టు అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. ఇక ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆయన కోరారు. హై సెక్యూరిటీ జోన్ గా పిలవబడే ప్రాంతంలో ఈ దాడి ఘటన జరిగిన ఆందోళనకరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చెయ్యటంతో అసదుద్దీన్ ఓవైసీ ఫిర్యాదు మేరకు అదనపు డిసిపి అసదుద్దీన్ ఓవైసీ నివాసాన్ని సందర్శించి దాడి జరిగిన తీరును పరిశీలించారు.
Delhi | Residence of AIMIM chief Asaduddin Owaisi, at Ashoka road, was allegedly attacked by some unknown persons. A complaint was filed by Asaduddin Owaisi in this regard. Addl DCP visited his residence, police collecting the evidence. pic.twitter.com/82hKfxF6hI
— ANI (@ANI) February 19, 2023
ఢిల్లీ పోలీస్ అధికారులు ఆయన నివాసం నుండి అవసరమైన అన్ని ఆధారాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న అసదుద్దీన్ ఓవైసీ రాజస్థాన్ లో పార్టీ పట్టు కోసం, ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లటం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రెండు రోజుల పాటు ఓవైసీ రాజస్థాన్ లో పర్యటించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications