ఆ రోజే కిరణ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు, అన్ని విషయాలు తెలుసుకున్నాం: ఈటెల
తమ ప్రభుత్వం నయీం లాంటి వారు చేసే అరాచకాలను సహించదని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం నాడు అన్నారు.
హైదరాబాద్: తమ ప్రభుత్వం నయీం లాంటి వారు చేసే అరాచకాలను సహించదని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం నాడు అన్నారు. తెలంగాణ శాసన సభలో గ్యాంగ్ స్టర్ నయీం కేసు పైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడారు.
తమ ప్రభుత్వం ఈనాడే కాదని, అసలు ఏనాడూ కూడా నయీం లాంటి వారు చేసే అరాచకాలను సహించబోదన్నాపు,తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నప్పటి నుంచే తమకు, తమ నాయకుడు కేసీఆర్కు ఎన్నో అంశాల గురించి తెలుసని చెప్పారు.
కాంగ్రెస్ హయాంలోనే నయీం ఆగడాలు వెలుగుచూశాయన్నారు. నయీం ఆగడాలపై అప్పుడు తాము మొత్తం పదిసార్లు ఫిర్యాదులు చేశామన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ పార్టీ ఫ్లోర్ లీడర్కు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు చేశామని చెప్పారు.
అయినా వారు పట్టించుకోలేదన్నారు. పార్టీ ఫ్లోర్ లీడర్కే రక్షణ లేకపోతే ఇక మరెవరికి రక్షణ కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. నయీం విషయంలో ఏనాడు పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏవేవో మాట్లాడుతున్నారన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇలాంటి వారి చర్యలను ఏ మాత్రం సహించడం లేదని చెప్పారు. చట్టాన్ని నడిపించాల్సింది ప్రభుత్వమే తప్ప, నేరస్తులు కాదని, దీనిని కేసీఆర్ రుజువు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క వ్యక్తి కోసం ఏనాడు పని చేయదన్నారు.
తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే తాము అన్ని విషయాలు తెలుసుకున్నామని, ప్రజలను కష్టపెట్టే వారిపై కఠినంగానే వ్యవహరిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గులను ఎప్పటికీ క్షమించదన్నారు.
పెద్ద నోట్ల రద్దుపై..
రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం పెరిగిందని, సేల్స్ ట్యాక్స్ గతేడాది కంటే 22 శాతం పెరిగిందన్నారు. వాహనాలపై 33 శాతం, సాంపులు, రిజిస్ట్రేషన్లపై 56 శాతం, భూములు అమ్మకం, ఇతర ఆదాయం .45 శాతంగా ఉందన్నారు. మొత్తంగా రాష్ట్ర ఆదాయంలో 13 శాతం వృద్ధి ఉందన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications