65 ఘాట్లలో పుష్కరాలు: మంత్రి ఇంద్రకరణ్ సమీక్ష(పిక్చర్స్)
హైదరాబాద్: ఇప్పటి వరకు 65 పుష్కర ఘాట్లు పూర్తి చేశామని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మిగిలిన పనులన్నీ జూన్ 30లోగా పూర్తి చేస్తామన్నారు. శనివారం గోదావరి పుష్కరాలపై మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వర, తదితరులు పాల్గొన్నారు.
సమావేశం ముగిసిన అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. పుష్కరాలు జరిగే ప్రదేశాల్లో జూన్ 21, 22 తేదీల్లో ఇంఛార్జులు, జిల్లా కలెక్టర్లు పర్యటిస్తారని చెప్పారు. పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం 1700 ప్రతేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భద్రాచలం, బాసర, మంచిర్యాల ఘాట్లకు ట్రైన్లు నడిచేలా ఏర్పాటు చేస్తామన్నారు.
పుష్కరాలపై సమీక్ష
ఇప్పటి వరకు 65 పుష్కర ఘాట్లు పూర్తి చేశామని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మిగిలిన పనులన్నీ జూన్ 30లోగా పూర్తి చేస్తామన్నారు.
పుష్కరాలపై సమీక్ష
శనివారం
గోదావరి
పుష్కరాలపై
మంత్రి
ఇంద్రకరణ్రెడ్డి
అధ్యక్షతన
సమావేశం
జరిగింది.
పుష్కరాలపై సమీక్ష
సమావేశం ముగిసిన అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. పుష్కరాలు జరిగే ప్రదేశాల్లో జూన్ 21, 22 తేదీల్లో ఇంఛార్జులు, జిల్లా కలెక్టర్లు పర్యటిస్తారని చెప్పారు.
పుష్కరాలపై సమీక్ష
పుష్కరాలకు
వచ్చే
భక్తుల
సౌకర్యం
కోసం
1700
ప్రతేక
బస్సులు
ఏర్పాటు
చేస్తున్నామని
చెప్పారు.
భద్రాచలం,
బాసర,
మంచిర్యాల
ఘాట్లకు
ట్రైన్లు
నడిచేలా
ఏర్పాటు
చేస్తామన్నారు.
పుష్కరాలపై సమీక్ష
భద్రాచలం, మంచిర్యాల ఘాట్లకు చినజీయర్స్వామి వెళ్తారని, ఆయా ప్రాంతాల్లో ఆయన 50 వేల మందికి అన్నదానం చేయనున్నట్లు చెప్పారు.
భద్రాచలం, మంచిర్యాల ఘాట్లకు చినజీయర్స్వామి వెళ్తారని, ఆయా ప్రాంతాల్లో ఆయన 50 వేల మందికి అన్నదానం చేయనున్నట్లు చెప్పారు. పుష్కర ఘాట్ల వద్ద అన్నదానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. పుష్కరాల వరకు వర్షాలు పడకుంటే నీరు ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం పుష్కరాల నిర్వహణ కోసం నిధుల కేటాయింపులో వివక్ష చూపించిందని, ఏపీకీ అధిక నిధులు ఇచ్చిందన్నారు. నిధుల్లో వ్యత్యాసంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు తెలిపామని, ఆయన తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పినట్లు వెల్లడించారు.