గవర్నర్ వ్యవస్థ అవసరం లేదు - ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా : మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు..!!
తెలంగాణలో ఇప్పుడు గవర్నర్ - ప్రభుత్వం మధ్య గ్యాప్ పెరుగుతోంది. తాజాగా ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ- అమిత్ షా తో భేటీ అయిన గవర్నర్ ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వం పైన వ్యాఖ్యలు చేసారు. తనను అవమానించారని వ్యాఖ్యానించారు. ఇక, మీడియా ప్రతినిధులతో చిట్ ఛాట్ లో అసెంబ్లీ సమావేశాల అనుమతి ఇవ్వకపోతే..అసెంబ్లీ రద్దు అయి ఉండేదని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల పై ఇప్పటికే పలువురు తెలంగాణ మంత్రులు స్పందించారు. ఇప్పుడు మరో మంత్రి తలసాని సీరియస్ వ్యాఖ్యలు చేసారు.
గవర్నర్ వ్యవస్థ వద్దని ఎప్పట్నుంచో డిమాండ్ ఉందని.. ఆ వ్యవస్థ అసరమే లేదని స్పష్టం చేసారు. గవర్నర్కి కూడా పరిమితులు ఉంటాయి... ప్రధాని, హోం మంత్రిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న, మెజార్టీ ఉన్న ప్రభుత్వాన్ని గవర్నర్ ఎలా రద్దు చేస్తారని నిలదీసారు. బీజేపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను రాజ్యసభకు పంపలేదా..పెద్దల సభలో నియామకాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందేనని చెప్పుకొచ్చారు. గవర్నర్ మీడియాతో రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. గవర్నర్లను ఎలా గౌరవించాలో సీఎంతో పాటుగా తమకూ తెలుసన్నారు.

గవర్నర్లను గౌరవించడంలో సీఎం కేసీఆర్ అందరికంటే ముందుంటారని తెలిపారు. గవర్నర్లను గౌరవించడంలో సీఎం కేసీఆర్ అందరికంటే ముందుంటారని తలసాని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ వెనుక ఎవరు ఉన్న వదలా వద్దని సీఎం కేసీఆర్ ఇప్పటికే చెప్పారన్నారు. నాడు ఎన్టీఆర్ను గద్దె దించేందుకు గవర్నర్ను వాడుకున్నారంటూ వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి మీడియాతో మాట్లాడలేను అని చాలా సార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. సెక్షన్ 8 అమలు దేనికి అంటూ నిలదీసారు. ఇదే సమయంలో కేంద్రానికి వ్యతిరేకంగా 11వ తేదీన ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ భవనలో నిరసనలకు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సిద్దం అవుతున్నారు,
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications