చంద్రబాబు టూర్ ముగియగానే ఢిల్లీకి చేరుకున్న కేసీఆర్, రాజకీయ ప్రాధాన్యత
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ఆకస్మికంగా ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన హఠాత్ పర్యటన అందరిలోను ఉత్కంఠ రేపుతోంది. కేసీఆర్ రెండు మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారని తెలుస్తోంది.
చదవండి: కాంగ్రెస్నుంచి పోటీచేస్తా, ఆ సీటు అడగకండి: బాబు వద్ద బండ్ల గణేష్ లాబీయింగ్, టీ కాంగ్రెస్ క్యూ
ఏపీలో ప్రతిపక్ష నేత జగన్ పైన కత్తి దాడి అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లారు. శనివారం పలువురు నేతలను కలిశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కేసీఆర్ పర్యటన ఆసక్తిని రేపుతోంది.

కేసీఆర్ ఢిల్లీ టూర్ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే కేసీఆర్ వెళ్లడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే అవకాశముందని సమాచారం. అయితే కంటి, పంటి పరీక్షల కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని ప్రభుత్వం చెబుతోంది.












Click it and Unblock the Notifications