హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిల్లలను చంపిన తల్లి: హెచ్ఐవి రోగి ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని ఎల్బీనగర్‌లోని చంద్రపురి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. నిర్మల అనే మహిళ తన ఇద్దరు చిన్నారులను ఇంటి ఎదుట ఉన్న సంపులో పడేసి చంపేసింది. మృతి చెందిన చిన్నారులు అర్చన(3)నెలలు, సహస్ర(6)నెలలు.

అయితే గతకొద్ది రోజులుగా నిర్మల మానసిక పరిస్థితి సరిగా లేదని బంధువులు, స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Mother kills her children: HIV patient commits suicide

హైదరాబాద్‌ నగరంలో ఓ హెచ్‌ఐవీ రోగి ఉరేసుకున్నాడు. రాంనగర్‌లోని సౌమ్య నర్సింగ్‌హోంలో చికిత్స పొందితున్న శ్రీనివాస్‌ అనే వ్యక్తి హెచ్‌ఐవీ రోగం ఉందని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మృతుడు శ్రీనివాస్‌ మెదక్‌ జిల్లవాసిగా పోలీసులు గుర్తించారు.

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్‌ ఆటోను, లారీ ఢీకొని ఆరుగురు మృతి చెందినట్లు తెలిసింది. సంగారెడ్డి మండలంలోని కంది- హైదరాబాద్‌ ఐఐటీ మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో మొత్తం 9మంది ప్రయాణిస్తుండగా ప్రమాద స్థలంలోనే ఆరుగురు మృతిచెందారు. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిని వారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు.

English summary
A mother Nirmala killed her girl children dumping to sump at LB Nagar in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X