ఉప్పల్ స్టేడియంలో మందుబాబుల వీరంగం: అభిమానుల మధ్య ఘర్షణ
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో మంగళవారం ముంబై ఇండియన్స్ జట్టుతో సన్రైజర్స్ హైదరాబాద్ టీం తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టుపై ముంబై ఇండియన్స్ టీం విజయం సాధించింది. అయితే, మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో అభిమానుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. హైదరాబాద్ ఈ టార్గెట్ ను ఛేదించే పనిలో ఉండగా .. స్టేడియంలో మందుబాబులు హల్చల్ చేశారు.

కొందరు క్రికెట్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. దీంతో ఫ్యాన్స్ వాగ్వాదానికి దిగారు. ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఫ్యాన్స్ గొడవపడుతుండటంతో పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులతోనూ మందబాబులు వాగ్వాదానికి దిగడంతో వారిని బయటికి పంపించేశారు. అయితే, మద్యం తాగినవారిని స్టేడియంలోకి ఎలా అనుమతించారని క్రికెట్ అభిమానులు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. క్రికెట్ చూసేందుకు ఎంతో ఆసక్తితో వస్తే తాగుబోతులు ఘర్షణలకు దిగి తమను భయాందోళనలకు గురిచేశారని మండిపడుతున్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications