చచ్చేదాకా ఇక్కడే: చక్రి తల్లి, కోడలి పేరు మీద ఆస్తుల చిట్టా విప్పారు
హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి కుటుంబ సభ్యులు.. తల్లి, సోదరుడు మూడ్రోజులుగా సోమాజిగూడలోని విల్లా వద్దనే బైఠాయించారు. ఈ సందర్భంగా తల్లి మాట్లాడుతూ... తాము కోర్టు తీర్పు మేరకు నడుచుకుంటామని చెప్పారు. అన్నీ ఆస్తులు తన కోడలు పేరుమీదే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు రోజులుగా చక్రి తల్లి, సోదరుడు విల్లా వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా వారు ఓ ఛానల్తో మాట్లాడారు. ఆమె లక్షలు కోట్లు తీసుకు వెళ్లిపోయిందన్నారు. మాకు ఇక్కడ ఏం లేకుండా పోయిందన్నారు. ఇంత దుర్మార్గం ఏ కోడలు చేయదని ఆవేదన వ్యక్తం చేశారు.

తాము ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చుంటామని, చచ్చేదాకా ఉంటామన్నారు. తనకు ఇప్పుడు పెన్షనే ఆధారమని చెప్పారు. ఆస్తులు అన్నీ తన కోడలు పేరు మీదే ఉన్నాయని చెప్పారు.
చక్రి సోదరుడు మాట్లాడుతూ.. కోట్లాది రూపాయల ఆస్తి ఉందని చెప్పారు. అన్నయ్య చనిపోయాక.. ఏం సంపాదించలేదని చెప్పారని కాని చాలా ఆస్తి ఉందని చెప్పారు. తమకు కనీసం ఉండేందుకు ఇల్లు కూడా లేదని చెప్పారు. అందుకోసమే తన తల్లి పోరాడుతోందన్నారు.

మొయినాబాదులో, సోమాజిగూడలో, శామీర్ పేటలో, శంషాబాదులో ప్లాట్లు, ఇళ్లు ఉన్నాయని చెప్పారు. గుంటూరులో అయిదెకరాల పొలం ఉందని చెప్పారు. తిరుపతిలో ఉన్న ప్లాట్ను అమ్మేసుకున్నారని, ఓ ఆడి కారు ఉందని చెప్పారు.
-
‘ధురంధర్2’ దెబ్బకు ‘పుష్ప2’ రికార్డులు గల్లంతు -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
మరో సూపర్ కాన్సెప్ట్తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
సాయి పల్లవి ఫ్యాన్స్కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్లో ఆనంద క్షణాలు -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!












Click it and Unblock the Notifications