హైదరాబాద్- వరంగల్ ప్రయాణం గంటలోనే.. నమో భారత్ పై బిగ్ న్యూస్!
తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెబుతోంది. నమో భారత్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం కారిడార్లలో హైదరాబాద్ వరంగల్ మార్గాన్ని కూడా చేర్చినట్టు కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఆర్థిక సర్వేలో ఈ విషయాన్ని చెప్పిన కేంద్రం దేశవ్యాప్తంగా 2900కిలోమీటర్ల మేర నిర్మించనున్న నమో భారత్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ హైదరాబాద్ వరంగల్ మార్గాన్ని చేర్చినట్టు చెప్పడం ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తుంది.
హైదరాబాద్ వరంగల్ మధ్య నమో భారత్ మార్గం
హైదరాబాద్ వరంగల్ మధ్య రాకపోకలు సాగించే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాదు హైదరాబాద్ వరంగల్ మధ్య నమో భారత్ మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుండి వరంగల్ కు రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తే మూడు గంటల సమయం పడుతుంది. రైలు మార్గంలో రెండు గంటల కన్నా ఎక్కువ సమయం పడుతుంది.

నమో భారత్ అందుబాటులోకి వస్తే గంటలోనే ప్రయాణం
నమో భారత్ అందుబాటులోకి వస్తే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం కేవలం ఒక గంటకు తగ్గిపోతుందని భావిస్తున్నారు. పెద్ద నగరాలను వాటి పరిసర పట్టణాలను కలిపే విధంగా ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యంగా కేంద్రం చెబుతోంది. ఈ ప్రాజెక్టు కారణంగా ప్రయాణికులు యొక్క ప్రయాణ సమయం విశేషంగా ఆదా అవుతుంది.
లక్షల సంఖ్యలో ప్రజలకు లబ్ధి
వరంగల్ నుంచి హైదరాబాద్ కు వెళ్లి వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగాలు చేసే వారికి ఈ నమో భారత్ మార్గం చాలా ఉపకరిస్తుంది. ఎక్కువ సమయం పట్టకుండా, కేవలం గంటలోనే గమ్యాన్ని చేరుకునే విధంగా దీని వల్ల వీలు కలుగుతుంది. హైదరాబాద్ వరంగల్ కారిడార్ కూడా నమో భారత్ అందుబాటులోకి వస్తే లక్షల సంఖ్యలో ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
వరంగల్ చుట్టుపక్కల పారిశ్రామిక రంగం గణనీయంగా వృద్ధి
ఈ ప్రాజెక్ట్ తో కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాకుండా, వరంగల్ చుట్టుపక్కల పారిశ్రామిక రంగం గణనీయంగా వృద్ధి చెందుతుందని, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పుంజుకుంటాయని కూడా తెలుస్తుంది. హైదరాబాద్ పరిసరాల్లో భూముల విలువలు కూడా పెరుగుతాయని, కొత్త పరిశ్రమలు వస్తాయన్న అభిప్రాయం ఉంది.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వరంగల్ హైదరాబాద్ మార్గం కీలకం
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హై స్పీడ్ రైళ్లను మూడింటిని హైదరాబాద్ మీదుగా అందించిన క్రమంలో తాజాగా నమో భారత్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ఈ కారిడార్ ను ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వరంగల్ హైదరాబాద్ మార్గం కీలక పాత్ర పోషిస్తుంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications