ఇంటర్ జవాబు పత్రాలు గల్లంతుకాలేదు, బోర్డు కార్యదర్శి అశోక్
ఇంటర్ బోర్డు అవకతవకలపై ఎట్టకేలకు బోర్డు కార్యదర్శి ఆశోక్ స్పందించారు. కాగా విద్యార్థుల పత్రాలు ఎవ్వరివి కూడ గల్లంతు కాలేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు క్షేత్ర స్థాయిలో కొన్ని తప్పులు జరిగాయని వారిపై చర్యలు చేపడతామని అన్నారు. ప్ర్రైవేట్ సంస్థలపై ఆధారపడకుండా ఉండేందుకు, ఇంటర్ బోర్డ్ పరీక్షలను చేపట్టే ప్రక్రియ లో భాగంగా గ్లోబరీనా అనే సంస్థ సేవలు తీసుకున్నామని తెలిపారు.

ఈనేపథ్యంలోనే కేవలం ముగ్గురు విద్యార్థులకు సంబంధించిన మోమోల్లో తప్పులు వచ్చాయని వాటిని సరిదిద్దినట్టు చెప్పారు. ఈనేపథ్యంలోనే ఏ ఒక్క విద్యార్థి ప్రశ్నపత్రం గల్లంతు కాలేదని తెలిపారు. జవాబు పత్రాలను చూపించేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు. కాగా పరీక్షకు హజరు కానివాళ్లను , ఉత్తీర్ణత సాధించని వాళ్లను సైతం పాస్ చేసినట్టు వచ్చిన కథనాలను ఆయన కొట్టిపడేశారు. అర్హులైన బోర్డు లెక్ఛరర్ల తోనే మూల్యంకనం చేయించామని అన్నారు. ఇక విద్యార్థులు సెంటర్ మారడం వల్లే ఏఫ్, ఏపి అనే సాంకేతిక సమస్యలు తలెత్తాయని చెప్పారు.












Click it and Unblock the Notifications