స్కూల్స్ లో ఇకపై "నో బ్యాగ్ డే".. తెలంగాణా సర్కార్ కీలక నిర్ణయం!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పాఠశాలలలో పిల్లల మంచి భవిష్యత్తు కోసం, పిల్లలపై ఒత్తిడి తగ్గించడం కోసం నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ప్రతి నెల నాలుగవ శనివారం రోజు నో బ్యాగ్ డే ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
విద్యార్థులను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి, వారిలోని సృజనాత్మకతను మరింత పెంచడానికి, క్షేత్రస్థాయి సందర్శనలతో పిల్లలకు నాలెడ్జ్ పెంచడానికి నిర్ణయించిన తెలంగాణ విద్యాశాఖ "నో బ్యాగ్ డే" అనే కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా స్కూల్ పిల్లల పుస్తకాల భారాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా నో బ్యాగ్ డే రోజున పలు కార్యకలాపాలను పిల్లల తోటి చేయించాలని నిర్ణయం తీసుకుంది.

పాఠశాల విద్యాశాఖకు చెందిన స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఒకటవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థుల కోసం మొత్తం విద్యా సంవత్సరంలో 10 నో బ్యాగ్ డే లను నిర్ణయించింది. ఆ రోజులలో వారు చేపట్టాల్సిన కార్యక్రమాలను పేర్కొంది. వీటిలో 28 రకాల కార్యకలాపాలు ఉండగా వాటిని వారి సామర్థ్యాన్ని బట్టి ఉపయోగించుకునే అవకాశం కూడా ఇస్తుంది.
ఇక నో బ్యాగ్ డే రోజున విద్యార్థులు చేపట్టవలసిన కార్యకలాపాల విషయానికి వస్తే మ్యూజియంలు, చారిత్రక ప్రదేశాలు, గ్రామపంచాయతీలు వంటి కార్యాలయాలను సందర్శించడం చేయనున్నారు. సైన్స్ ప్రయోగాలు, డూడ్లింగ్, మోడల్ ఎలక్షన్స్, మోడల్ అసెంబ్లీ వంటి ఇండోర్ కార్యకలాపాలు, అంతేకాకుండా పాఠశాలలోనే వివిధ విషయాలను నేర్చుకోవడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
ప్రైమరీ కేటగిరిలో 1, 2 వ తరగతి చదివే విద్యార్థులకు ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. కుటుంబంలోని వ్యక్తుల మాదిరిగా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల పిల్లల్లో భయం పోయి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. వారిలో సృజనాత్మక శక్తి పెరిగేలా ఫ్యామిలీ లోని ఒక వ్యక్తి యొక్క బొమ్మ గియ్యవలసిన ఉంటుంది.

3 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకు వివిధ వృత్తులలో ఉపయోగించే పనిముట్లను డ్రాయింగ్ గీయవలసి ఉంటుంది. వారికి నచ్చిన వృత్తి గురించి మాట్లాడవలసి ఉంటుంది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే పిల్లలకు ఫ్యామిలీ బడ్జెట్ ను విశ్లేషించడం, ఫీల్డ్ విజిట్ చేయడం, అవుట్ డోర్ మరియు ఇండోర్ యాక్టివిటీస్ ఉంటాయి.
అంతేకాదు సెకండరీ స్కూల్ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన అనేక అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో వీటిని తప్పనిసరి చేస్తున్నట్టు తెలంగాణా విద్యా శాఖ పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం బాగున్నా పిల్లల్లో సృజన పెంచటం కోసం ఈ ప్రయత్నం ఏ మేరకు సఫలం అవుతుందో వేచి చూడాలి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications