గ్యాదరి కిశోర్కు రూ. 18 వేలు, సైదిరెడ్డికి రూ.45 వేలు: కరెంట్ చార్జీల అపోహలపై మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ బిల్లు చూసి సామాన్యుడి నుంచి సంపన్నుడు ఒక్కసారిగా నోరు తెరిచాడు. సగటున గత రెండు నెలల కన్నా బిల్లు ఎక్కువ రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఉదాహరణకు గత రెండునెలల్లో రూ.800 ఉన్న బిల్లు మూడో నెలకు వచ్చేసరికి రూ.1600 చేరింది. అంతేకాదు లాక్ డౌన్ సడలింపుల వల్ల కరెంట్ బిల్లు కట్టాల్సిందేనని ప్రభుత్వం స్పష్టంచేసింది. లేదంటే కరెంట్ కట్ చేస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో కరెంట్ బిల్లు గురించి ప్రజలు పడుతున్న ఆందోళనపై మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

అపోహే...?
కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందనేది అపోహ మాత్రమేనని మంత్రి తెలిపారు. ఈ నెల బిల్లుతో అందరూ అనుమాన పడ్డారని.. కానీ పైసా ఎక్కువగా రాలేదని చెప్పారు. మూడు నెలల బిల్లు కావడంతో ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తోందని తెలిపారు. వేసవిలో ఎక్కువ కరెంట్ వాడటంతో శ్లాబ్ మారి ఎక్కువ వచ్చిందనే అపోహలో ఉన్నారని చెప్పారు. కానీ బిల్లులో పైసా ఎక్కువగా లేదని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఓకే కిస్తీలో బిల్లు కట్టమని అనుకుంటే.. 3 నెలల్లో చెల్లించాలని సూచించారు.

1.5శాతం వడ్డీ...
3 నెలలు చెల్లించేవారికి 1.5 శాతం వడ్డీ పడుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి వివరించారు. జూన్ నెలలో 30, జూలైలో 40 శాతం, ఆగస్ట్ 30 శాతం చొప్పున రెగ్యులర్ బిల్లుతో కలిపి కట్టాలని సూచించారు. జూన్ నెలలో బిల్లు కట్టాలని, లేదంటే పవర్ కట్ చేస్తామని చెప్పారు. మూడు వాయిదాల్లో కరెంట్ బిల్లు కట్టేవారు ఈఆర్వోలో మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కిస్తీ రూపంలో చెల్లించే కరెంట్ బిల్లు ఇళ్లలో వాడేవారికి మాత్రమేనని నొక్కి వక్కానించారు.

ఎమ్మెల్యేలు కూడా..
కరెంట్ బిల్లులపై ప్రజలే కాదు ఎమ్మెల్యేలు గందరగోళానికి గురయ్యారని చెప్పారు. ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్కు రూ.18 వేలు, సైదిరెడ్డికి రూ.45 వేల కరెంట్ బిల్లు వచ్చిందని చెప్పారు. వారు తనవద్దకు వస్తే.. విద్యుత్ అధికారులు వివరించడంతో వారు సంతృప్తి చెందారని పేర్కొన్నారు. విద్యుత్ సెక్రటరీ అజయ్ మిశ్రాకు కూడా రూ.21 వేల కరెంట్ బిల్లు వచ్చిందని... ఆయనతో సిబ్బంది డిస్కష్ చేశారని తెలిపారు. వారికి అధికారులు సమగ్రంగా వివరించడంతో అర్థమైందని తెలిపారు. కరెంట్ బిల్లులో తేడా, అనుమానాల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. సందేహాం ఉన్నవారు కాల్ చేయాలని సూచించారు.
Recommended Video

అలా ఉండదు..
కరెంట్ బిల్లులకు స్లాబ్ జంప్ అనేది ఎప్పుడూ ఉంటుందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ వల్ల నెల నెల నెల మీటర్ రీడింగ్ తీసే అవకాశం లేకపోయిందని వివరించారు. ఈఆర్సీ ఆదేశాల మేరకు మూడు నెలల యావరేజీ ప్కారం బిల్లు ఇచ్చామని గుర్తుచేశారు. పేపర్, కరెన్సీ నోట్లపై వైరస్ వస్తుందనే ఆందోళనలో రీడింగ్ తీయడం వీలుకాలేదని చెప్పారు. అనుమానం ఉన్నవారు హెల్ప్ డెస్క్కు ఫోన్ చేయాలని సూచించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications