ఆ 2జిల్లాల్లో..: ఇక తెలంగాణ జిల్లాలపై దృష్టి సారించిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్: ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో జనసేన ఎంపిక శిబిరాలు విజయవంతం కావడంతో ఆ పార్టీ తెలంగాణపై దృష్టిసారించింది. ఈ క్రమంలోనే తెలంగాణ జిల్లాల్లో జనసైన్యాన్ని ఎంపికచేయాలని నిర్ణయించారు ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్.
జూన్ 24న ఆదిలాబాద్, 25న కరీంనగర్ జిల్లాల్లో జనసేన శిబిరాలను నిర్వహిస్తున్నట్టు పవన్ తెలిపారు. ఈ రెండు జిల్లాల పరిధిలోని ఆసక్తి కల్గిన అభ్యర్థులు జూన్ 22, 23 తేదీల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జూన్ 24న మంచిర్యాల జిల్లాలోని ఫారెస్ట్ కాంట్రాక్టు అసోసియేషన్ ఫంక్షన్ హాలులో, 25న పెద్దపల్లి జిల్లాలోని డీసెంట్ ఫంక్షన్ హాల్లో ఈ ఎంపిక శిబిరాలు ఏర్పాటుచేయనున్నట్టు పవన్ తెలిపారు. ఎవరైనా అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోని పక్షంలో నేరుగా వేదిక వద్ద తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని పవన్ స్పష్టంచేశారు.