కవితక్క 500000, ఎన్ఆర్ఐల యాగం
ఎన్నికల్లో గెలవాలంటే ప్రజాబలంతోపాటు , దైవసంకల్పం కూడ ఉండాలని అభ్యర్థులు బలంగా నమ్ముతారు.ఇందులో భాగంగానే నామినేషన్లు వేసేటప్పుడు మంచి ముహుర్తాలు సైతం చూసుకుని నామినేషన్ వేస్తారు. దీంతో వారి ప్రచారం కోనసాగుతోంది.ఈ నేపథ్యంలోనే కార్యకర్తలు నాయకులు సైతం వారు నమ్ముకున్న దైవం ముందు పూజలు , హోమాలు చేస్తారు .ఈనేపథ్యంలోనే ప్రస్తుత ఎన్నికల్లో నిజమామాద్ ఎంపీ కవిత గెలుపును కోరతూ ఎన్ఆర్ఐలు సైతం యజ్ఝాలు చేశారు.

తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ప్రస్తుత నిజమాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గెలుపుతోపాటు ఆమేకు 5లక్షలకు పైగా మెజారిటి రావాలని యూఎస్, యూకేకు చెందిన ఎన్ఆర్ఐలు నిజమాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని సారంగాపూర్ గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో యజ్ఝం నిర్వహించారు. కాగా కవిత గెలుపు కోసం వారం రోజులుగా ఇక్కడే మాకం వేశారని ఎన్ఆర్ఐ యూకే అధికార ప్రతినిధి చందాసురేశ్ రెడ్డి తెలిపారు.

గల్ఫ్ ప్రాంతాల్లో చిక్కుకుని కష్టాల్లో ఉన్న ఎన్ఆర్ఐల కోసం కవిత ఎంతో కష్టపడ్డారని , ఇప్పుడు ఆమే గెలపుకోసం కృషి చేయాల్సిన భాద్యత తమపై ఉందని వారు తెలిపారు.కాగా ఇందుకోసం ప్రతి ఒక్కరిని కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని వారు కోరుతున్నారు..దీంతో ఆమే గెలుపు ఖాయమే అయినా 5 లక్షల మెజారిటీ రావాలనే కాంక్షతోనే యజ్ఝం చేసినట్టు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications