పెళ్లైన మూడ్రోజులకే పరారైన ఎన్నారై: ఫారెన్లో ఇలాగే చేస్తామని...!
హైదరాబాద్: వరంగల్ జిల్లాకు చెందిన ప్రశాంతి అనే యువతిని ఎన్నారై శ్రవణ్ పెళ్లి చేసుకొని, మూడు రోజుల పాటు కాపురం చేసి ఆ తర్వాత విదేశాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. బాధితురాలు అతనికి ఎన్నిమార్లు ఫోన్ చేసినా ఫారెన్లో నచ్చితేనే పెళ్లి చేసుకుంటామని, లేదంటే వదిలేస్తామని, నీతోను అంతేనని చెప్పాడు.
తాను ఇరవై రోజుల క్రితం చివరిసారి అతనితో మాట్లాడానని, తనను తీసుకు వెళ్తానని ఇప్పటి వరకు అతను చెప్పలేదన్నారు. పైగా తనను వదిలేస్తున్నట్లు చెప్పాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇధ్దరికి పెళ్లైన మూడు రోజుల వరకు బాగానే ఉన్నామని చెప్పారు.
ఆ తర్వాత హఠాత్తుగా విదేశాలకు వెళ్లిపోయాడని, ఫోన్ చేస్తే సానుకూలంగా స్పందించడం లేదన్నారు. అతను మరో పెళ్లి చేసుకుంటున్నట్లుగా తెలిసిందని, అలా అయితే కేసు పెడతామని చెప్పారు. శ్రవణ్ మోసం గురించి అతని తల్లిదండ్రులను అడిగితే... దాని గురించి తమకు తెలియదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎనిమిది నెలల క్రితం తమ ప్రేమ మొదలైందని, పెళ్లై అయిదు నెలలు అవుతోందని చెప్పారు. వరంగల్ వచ్చి మరీ తనను పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. మూడు రోజుల పాటు తాము సంతోషంగానే ఉన్నామన్నారు. తనకు తన తల్లిదండ్రుల మద్దతు ఉందని చెప్పారు.
తనను అత్తింటి వద్దని చెబుతున్నారన్నారు. తాను యూరోప్ సిటిజన్ను అని, తనను ఎవరూ ఏం చేయలేరని అతను చెబుతున్నాడని బాధితురాలు వాపోయారు. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఆమె చూపించారు. అతని తరఫున పెళ్లికి ఎవరూ రాలేదని చెప్పారు. వీడియో కాల్లో తాము చాటింగ్ చేసుకున్నామన్నారు.
తాము గతంలో హైదరాబాదులో రెండుసార్లు, వరంగల్లో ఒకసారి కలుసుకున్నామని చెప్పారు. పెళ్లి సమయంలో ఖర్చుల నిమిత్తం తాను రూ.2 లక్షలు ఇచ్చానని ఆమె చెప్పారు. కాగా వరంగల్ జిల్లాకు చెందిన ప్రశాంతి అనే యువతిని శ్రావణ్ అనే ఎన్నారై పెళ్లి పేరుతో మోసం చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications