నుమాయిష్ 2023: అనుమతి ఇవ్వొద్దు; హైకోర్టులో న్యాయవాది పిటీషన్.. ఎందుకంటే!!
82వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నిర్వహణకు ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పాట్లు చేస్తుంది. జనవరి 1 2023 నుంచి ప్రారంభం కానున్న ప్రతిపాదిత 82వ ఆలిండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ నిర్వహణకు అనుమతి ఇవ్వకూడదని తెలంగాణ హైకోర్టులో న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్ ప్రభుత్వంలోని వివిధ వాటాదారుల పై పిటిషన్ దాఖలు చేశారు.

నుమాయిష్ కు అనుమతి ఇవ్వొద్దు.. హైకోర్టులో పిటీషన్
ఎగ్జిబిషన్ సొసైటీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జనరల్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ తో పాటు హైదరాబాద్ సిటీ పోలీసుల నుండి కూడా చట్టబద్ధమైన అనుమతులు పొందలేదని తాను దాఖలు చేసిన పిటిషన్లో న్యాయవాది తెలిపారు. తెలంగాణ అగ్నిమాపక సేవలు చట్టం 1999 నిబంధనల ప్రకారం నుమాయిష్ ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు లేఅవుట్ ఆమోదం పొంది, దాని కింద రూపొందించబడిన నిబంధనల ప్రకారం నుమాయిష్ ను ప్రారంభించాల్సి ఉంటుంది. అగ్నిమాపక శాఖ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తే, వారి యొక్క నిబంధనలకు, ఆమోదాలకు లోబడి నుమాయిష్ నిర్వహించాల్సి ఉంటుంది.

జీహెచ్ఎంసీ, సిటీ పోలీసుల అనుమతులేవీ?
జిహెచ్ఎంసి నుండి జీహెచ్ఎంసీ చట్టం 1955 నిబంధనల ప్రకారం జీవో తో సహా తప్పనిసరిగా అవసరమైన ఇతర అనుమతులను పొందాల్సి ఉంటుంది. అదేవిధంగా సిటీ పోలీసుల నుండి కూడా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నుమాయిష్ సొసైటీ అవేవీ లేకుండా నుమాయిష్ నిర్వహణకు ప్రయత్నం చేస్తోందని అడ్వకేట్ దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తే దీనికి సంబంధించి అధికారులు కూడా బాధ్యులు అవుతారని అడ్వకేట్ ఖాజా ఐజాజుద్దీన్ తాను దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.

నుమాయిష్ పై సుప్రీం ను కూడా ఆశ్రయించిన న్యాయవాది
నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం ప్రజల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేయడం చట్టవిరుద్ధమని, అసమంజసమని పేర్కొన్నారు. ట్రేడర్ లకు మాత్రమే అవకాశం ఇవ్వకుండా సాధారణ ప్రజలను, వ్యాపారులను స్టాల్స్ కోసం దరఖాస్తులకు పిలవాలని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు 2022 జనవరిలో అడ్వకేట్ ఖాజా ఐజాజుద్దీన్ సుప్రీంకోర్టులో ప్రత్యేక సెలవు పిటిషన్ ను దాఖలు చేశారు. తాను దాఖలు చేసిన పిల్ లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశారు.

నుమాయిష్ పై విచారణ.. వివిధ ప్రభుత్వాధికారులకు నోటీసులు
అయితే 2022వ సంవత్సరం ఆగస్టులో జస్టిస్ డి వై చంద్రచూడ్, ఏఎస్ బోపన్న మరియు జెబి పార్దివాలాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసులో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాలని సూచనతో పిటిషన్ ను కొట్టివేసింది. ఇక తాజాగా తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి వివిధ ప్రభుత్వ అధికారులకు దీనిపై నోటీసులు జారీ చేశారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications