మా ఇంటిపై ఆరోపణల్లో నిజం లేదు: హైడ్రా కమిషనర్ రంగనాథ్
తమ ఇల్లు విషయంలో వస్తున్న వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైదరాబాద్ మధురానగర్లో తన ఇల్లు బఫర్ జోన్లో ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
'సోషల్ మీడియాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. 44 ఏళ్ల క్రితం మా నాన్న నిర్మించిన ఇంట్లోనే ఉంటున్నాం. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఒకప్పటి పెద్ద చెరువునే 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చారు. కృష్ణకాంత్ పార్క్కు మా ఇంటికి మధ్య వేలాది ఇల్లు ఉన్నాయి. చెరువు కట్టకు దిగువన 10 మీటర్లు దాటితే బఫర్ జోన్ పరిధిలోకి రావు. మా ఇల్లు చెరువు కట్టకు దాదాపు కిలోమీటర్ దూరం ఉంది' అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది చేస్తున్న ప్రయత్నాన్ని ఖండిస్తున్నానని అన్నారు. 44 ఏళ్ల క్రితం నిర్మించిన అదే ఇంట్లో తన తండ్రితో కలిసి ఉంటున్నట్లు తెలిపారు. కాగా, యూసఫ్గూడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్లోనే ఉందని.. అది ఒకప్పటి చెరువు అని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోపించారు.
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, చెరువులను ఆక్రమించిన కట్టడాలను హైడ్రా కూలుస్తున్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం పేదల ఇళ్లను, ఏళ్లుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లను కూల్చబోమని అన్నారు. అయితే, అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాలను, చెరువులను ఆక్రమించి కట్టిన వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్












Click it and Unblock the Notifications