వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశేషమే: కుమారులతో వచ్చి కేసీఆర్ను కలిసిన పరిటాల సునీత
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత బుధవారం కలిశారు. ఆమెతోపాటు కుమారులు శ్రీరామ్, సిద్దార్థ్లు కూడా ఉన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత బుధవారం కలిశారు. ఆమెతోపాటు కుమారులు శ్రీరామ్, సిద్దార్థ్లు కూడా ఉన్నారు.
పెద్ద కుమారుడు శ్రీరామ్ వివాహానికి రావాల్సిందిగా కేసీఆర్ను మంత్రి సునీత ఆహ్వానించారు. పరిటాల శ్రీరామ్ వివాహం వచ్చే అక్టోబర్ 1న జరగనుంది. కాగా, పెళ్లి కూతురు జ్ఞానవి.. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల మండలంకు చెందిన ఏవీఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఆలం వెంకటరమణ, సుశీలమ్మ కుమార్తె.
ఆగస్టు 10న జ్ఞానవితో శ్రీరామ్ నిశ్చితార్థం హైదరాబాద్లో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హాజరై శ్రీరామ్, జ్ఞానవీలను ఆశీర్వదించారు.
Comments
kcr engagement paritala sunitha paritala sriram marriage nandamuri balakrishna balakrishna కేసీఆర్ పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ వివాహం పెళ్లి నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ
English summary
Andhra Pradesh minister Paritala Sunitha on Wednesday met CM K Chandrasekhar Rao with her two sons to invite Sriram's wedding ceremony.