శంషాబాద్లో ఏటీఎం విచిత్రం: రూ.100 విత్ డ్రా చేస్తే రూ.500, జనం క్యూ
శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఓ ఏటీఎం నుంచి డబ్బుల వర్షం కురిసింది. ఏటీఎం నుంచి రూ.100 విత్ డ్రా చేయగా.. రూ.500 నోటు వచ్చింది.
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఓ ఏటీఎం నుంచి డబ్బుల వర్షం కురిసింది. ఏటీఎం నుంచి రూ.100 విత్ డ్రా చేయగా.. రూ.500 నోటు వచ్చింది. ఈ విషయం తెలియడంతో చాలామంది ఏటీఎం వద్దకు చేరుకున్నారు.
చాలామంది అలా డ్రా చేసుకున్నారు. దాదాపు రూ.8 లక్షల మేర నగదు డ్రా అయినట్లుగా తెలుస్తోంది. విమానాశ్రయంలోకి వెళ్లే వద్ద రెండో గేటు సమీపంలో కొటక్ మహింద్రా బ్యాంకుకు చెందిన ఏటీఎం ఉంది.

ఓ వ్యక్తి శనివారం సాయంత్రం రూ.2500 డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. అతనికి రూ.2000 నోటు ఒకటి వచ్చింది. మిగతా రూ.500కు.. అయిదు వంద నోట్లు లేదా ఒక ఐదు వందల నోటు రావాలి. కానీ అతనికి అయిదు 500 నోట్లు వచ్చాయి.
మొత్తం రూ.4500 వచ్చాయి. దీంతో ఏటీఎం వద్ద క్యూలో నిలుచుకన్న మిగతా వారు కూడా ఇలాగే డ్రా చేసుకొని వెళ్లిపోయారు. ఇలా అరగంటకు పైగా జరిగింది. విమానాశ్రయ అధికారులు బ్యాంకు సిబ్బందిని రప్పించి తాత్కాలికంగా మూసివేయించారు. సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications