తెలంగాణ బియ్యమే కావాలంటూ ఫిలిప్పీన్స్ పట్టు

తెలంగాణ బియ్యం కావాలంటూ ఫిలిప్పీన్స్‌ దేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆ దేశ ఆహార, వ్యవసాయశాఖ మంత్రి రోజేర్స్‌ తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఈ విషయంపై చర్చించారు. ఫిలిప్పీన్స్​ ప్రతినిధులు కొద్దిరోజుల క్రితం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్, ఇతర నిపుణులతో మాట్లాడి వెళ్లారు.

ఈ క్రమంలో పౌర సరఫరాల భవన్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్‌ కుమార్​, ఫిలిప్పీన్స్‌ మంత్రి రోజేర్స్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి 3 లక్షల టన్నుల బియ్యం ఎగుమతుల అంశం ప్రతిపాదనపై ప్రాథమికంగా చర్చించారు. తెలంగాణ బియ్యం నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Philippines asked the state government to get Telangana rice

రాష్ట్రంలో ధాన్యం రకాలు, బియ్యం నాణ్యతపై మంత్రి వివరించారు. విదేశాలకు బియ్యం ఎగుమతులపై ప్రస్తుతం 10 శాతం సుంకం​ ఉంది. సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న నేపథ్యంలో బియ్యం ఎగుమతుల విషయంలో సుంకం మినహాయింపుపై రాష్ట్రప్రభుత్వం దృష్టి పెట్టింది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించారు. ఆయన త్వరలో ఫిలిప్పీన్స్‌కు వెళ్లి మరో దఫా చర్చలు జరపనున్నారు. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చాక బియ్యం ధరపై నిర్ణయంపై తీసుకోనున్నట్లు పౌరసరఫరాలశాఖ వర్గాలు తెలిపాయి.

ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఫిలిప్పీన్స్ మంత్రి ఇద్దరూ పూర్తి పరస్పర సహకారానికి హామీ ఇచ్చారు. ఒప్పందం త్వరలో కార్యరూపం దాల్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది కార్యరూపం దాలిస్తే తెలంగాణ పౌరసరఫరాల శాఖకు మరో అవకాశం అవుతుంది. బియ్యం నాణ్యతను మెరుగుపరచడం, ప్రమాణాలకు అర్హత ఉండటంతో, తమ వరి సంవత్సరాల విరామం తర్వాత ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది అని అధికారులు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ మార్కెట్‌లో ప్రాధాన్యతనిచ్చే చక్కటి రకాల సాగును ప్రోత్సహిస్తోంది. వరి 12 మిలియన్ ఎకరాలకు పైగా సాగు చేయబడుతోంది. వార్షిక ఉత్పత్తి 26 మిలియన్ టన్నుల క్రమంలో ఉంది. రాష్ట్రంలో 220కి పైగా వరి రకాలను పండిస్తున్నారు. దేశం నుంచి బియ్యం ఎగుమతుల విషయానికొస్తే, భారతీయ వరి రకాలు 100 దేశాలలో మెరుగైన మార్కెట్‌ను కలిగి ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్ వాటాలో దేశం 45 శాతాన్ని ఆక్రమించిందని, భవిష్యత్తులో 2030 నాటికి అనేక దేశాలకు ఆహారం అందించేందుకు భారత్‌లో మిగులు బియ్యం లభిస్తుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+