కష్టాలు తీరుస్తా: ప్లాంట్లో తిరిగిన కేసీఆర్ (పిక్చర్స్)
నిజామాబాద్: మంచిర్యాలను జిల్లాగా మారుస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో జైపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో నిర్మిస్తున్న థర్మల్ ప్లాంటు పనులను త్వరగా పూర్తి చేసి 2015 నవంబర్లో ఉత్పత్తి ప్రారంభించాలని ముఖ్యమంత్రి సింగరేణి అధికారులను ఆదేశించారు.
గురువారం థర్మల్ ప్లాంటు పనులను, ప్రగతిని స్వయంగా పరిశీలించి ఆయా అధికారులకు తగిన సలహా, సూచనలు, ఆదేశాలను వివరించారు. కాగా, కరెంట్ కష్టాలు తీరుస్తానని చెప్పారు.
కేసీఆర్
ప్లాంటు పనులు నత్తనడకన నడస్తున్నాయని, త్వరగా పూర్తి చేసేవిధంగా పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సింగరేణి సి అండ్ ఎండి సుథీర్థ భట్టాచార్యను ఆదేశించారు.
కేసీఆర్
ప్లాంటు నిర్మాణ పనుల వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం థర్మల్ ప్లాంటు సాంకేతిక నిపుణులు, ట్రాన్స్కో అధికారులు, జిల్లా అధికారులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కేసీఆర్
ఈ సమీక్ష సమావేశంలో ప్లాంటు వివరాలను, అధికారు పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్లాంటుకు కావాల్సిన భూ సేకరణతో పాటు నీటి సరఫరా కోసం చేపట్టే పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కేసీఆర్
కోటపల్లి మండలంలోని దేవులవాడతో పాటు చెన్నూర్ ప్రాంతంలో నిర్మించే నీటి రిజర్వాయర్ కోసం భూ సేకరణ పనులు త్వరగా పూర్తి చేసి రిజర్వాయర్ పనులు చేపట్టే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.
కేసీఆర్
అదే విధంగా జైపూర్ పవర్ ప్లాంట్లో 1200 మెగావాట్ల ఉత్పత్తే కాకుండా మరో 600 మెగావాట్ల ఉత్పత్తి చేసేందుకు సరిపడా భూమి ఉందా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం సామర్థ్యం పెంచుతామని చెప్పారు.
కేసీఆర్
ప్లాంటు పనుల విషయంలో మరోసారి పర్యవేక్షించి జిల్లాయంత్రాంగంతో పాటు ట్రాన్స్కో అధికారులతో సమీక్షించనున్నట్లు తెలిపారు.
కేసీఆర్
ప్లాంటు నిర్మాణం కోసం ఎన్టీపీసీ నుంచి ఎస్టేట్ అధికారిని నియమించారు. భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి అందరినీ ఆదుకుంటామన్నారు.
కేసీఆర్
ప్లాంటు పనులు నత్తనడకన నడస్తున్నాయని, త్వరగా పూర్తి చేసేవిధంగా పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సింగరేణి సి అండ్ ఎండి సుథీర్థ భట్టాచార్యను ఆదేశించారు.
కేసీఆర్
ప్లాంటు నిర్మాణ పనుల వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం థర్మల్ ప్లాంటు సాంకేతిక నిపుణులు, ట్రాన్స్కో అధికారులు, జిల్లా అధికారులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కేసీఆర్
ఈ సమీక్ష సమావేశంలో ప్లాంటు వివరాలను, అధికారు పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్లాంటుకు కావాల్సిన భూ సేకరణతో పాటు నీటి సరఫరా కోసం చేపట్టే పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కేసీఆర్
కోటపల్లి మండలంలోని దేవులవాడతో పాటు చెన్నూర్ ప్రాంతంలో నిర్మించే నీటి రిజర్వాయర్ కోసం భూ సేకరణ పనులు త్వరగా పూర్తి చేసి రిజర్వాయర్ పనులు చేపట్టే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.
కేసీఆర్
అదే విధంగా జైపూర్ పవర్ ప్లాంట్లో 1200 మెగావాట్ల ఉత్పత్తే కాకుండా మరో 600 మెగావాట్ల ఉత్పత్తి చేసేందుకు సరిపడా భూమి ఉందా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కేసీఆర్
ప్లాంటు పనుల విషయంలో మరోసారి పర్యవేక్షించి జిల్లాయంత్రాంగంతో పాటు ట్రాన్స్కో అధికారులతో సమీక్షించనున్నట్లు తెలిపారు. ప్లాంటు నిర్మాణం కోసం ఎన్టీపీసీ నుంచి ఎస్టేట్ అధికారిని నియమించారు. భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి అందరినీ ఆదుకుంటామన్నారు.