చిత్తుగా తాగేసి మూగ బాలికపై కామాంధుడి అఘాయిత్యం
మెదక్: వికలాంగ మూగ బాలికపై చిత్తుగా మద్యం సేవించిన ఓ కామంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా గజ్వెల్ మండల పరిధిలోని బయ్యారం గ్రామంలో శనివారం సాయంత్రం జరిగింది. కూతురు వయసున్న పదేళ్ల బాలికను లైంగిక దాడి చేసిన అనంతరం అక్కడ నుంచి నిందితుడు పారిపోయాడు.
వ్యవసాయ పనుల్లోకి వెళ్లిన తల్లి ఇంటికి చేరుకోగానే కూతురు బాత్రూంలోనే ఉండి కన్పించింది. దీంతో కుమారుడు తల్లికి విషయాన్ని చెప్పడంతో వెంటనే కూతురిని తీసుకొని గజ్వేల్లోని ఏరియా ఆస్పత్రికి వైద్యం కోసం తీసుకెళ్లింది. చికిత్స చేసిన వైద్యులు మెరుగైనా చికిత్స కోసం నీలోఫర్ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు బయ్యారం గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించి లైంగిక దాడికి ఒడిగట్టిన మంగలి నర్సింలును అదుపులోకి తీసుకున్నారు.
అదే రాత్రి బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. బాధితురాలికి నిలోఫర్ దవాఖానలో మెరుగైన వైద్యం అందుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
బాలిక లైంగిక దాడికి గురైన విషయం తెలుసుకున్న ఎస్పీ సుమతి ఆదివారం ఉదయం గ్రామానికి చేరుకుని గ్రామస్తుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి ఎస్పీ సుమతి మాట్లాడుతూ గ్రామంలో పని లేకుండా ఆవరాగా తిరిగే వాల్లతోనే సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు.
గ్రామస్తులతో మాట్లాడిన అనంతరం త్వరలోనే గ్రామంలో సభ ఏర్పాటు చేయాలని, సమావేశాని తాను హాజరవుతానని తెలిపారు. జిల్లా కలెక్టర్తో ఫోన్లో బాధిత కుటుంబ సభ్యులకు సాయం అందించే విధంగా చూడాలని కోరారు. కలెక్టర్ సూచన మేరకు తహసీల్దార్ బాల్రెడ్డి బాధిత కు టుంబ సభ్యులకు రూ.25 వేల చెక్కును అందజేశారు.