ఉదయం పూట ఇడ్లీలు అమ్ముతాడు, రాత్రిపూట ఇళ్ళలో దొంగతనాలు,ఎందుకంటే?
జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతున్న నాగరాజు అనే దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం పూట ఇడ్లీలు అమ్ముతూ రాత్రిపూట దొంగతనాలకు నాగరాజు పాల్పడేవాడు.
హైదరాబాద్ :మద్యం తాగడం, జూదం ఆడడం లాంటి వ్యసనాలకు బానిసగా మారాడు.దీంతో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఉదయంపూట ఇడ్లీలు అమ్మడం, రాత్రిపూట దొంగతనాలుచేస్తూ జల్సాలకు డబ్బులను సంపాదిస్తున్నాడు. ఎట్టకేలకు పంజగుట్ట పోలీసులు ఈ దొంగను అరెస్టు చేశారు.
కర్నూల్ జిల్ల ఆళ్ళగడ్డకు చెందిన నాగరాజు పాత నేరస్థుడు. ఇతనిపై ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏడు కేసులున్నాయి. ప్రస్తుతం అమీర్ పేటలోని ఎల్లారెడ్డిగూడలో ఇండ్లీ బండి నడుపుతున్నాడు.

ఉదయం నుండి రాత్రివరకు ఇడ్లీలు అమ్మడం, రాత్రిపూట తాళాలు వేసిన ఇళ్ళు, దుకాణాలకు షట్టర్లు పగులగొట్టి అందినకాడికి దోచుకోవడం నాగరాజుకు అలవాటు.
దొంగతనం ద్వారా సంపాదించిన డబ్బును మద్యం తాగేందుకు జూదం ఆడేందుకు ఉపయోగించేవాడు. జల్సాల కోసమే ఈ డబ్బును ఉపయోగించుకొనేవాడు.
పంజగుట్ట ఠాణ పరిధిలోని ఇండేన్ గ్యాస్ దుకాణం, బ్రిడ్జిస్టోన్ టైర్ల దుకాణంలో రూ.1.30 లక్షలు చోరి చేశాడని పోలీసులు తెలిపారు.
నిందితుడి నుండి బేగంపేట రైల్వేస్టేషన్ సమీపంలో మూడు తులాల బంగారు గొలుసు, రూజ1.30 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. నాగరాజుపై పిడి చట్టాన్ని నమోదు చేయాలని పోలీసులు ఉన్నతాధికారులకు ప్రతిపాదించారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications