ఉదయం పూట ఇడ్లీలు అమ్ముతాడు, రాత్రిపూట ఇళ్ళలో దొంగతనాలు,ఎందుకంటే?
జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతున్న నాగరాజు అనే దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం పూట ఇడ్లీలు అమ్ముతూ రాత్రిపూట దొంగతనాలకు నాగరాజు పాల్పడేవాడు.
హైదరాబాద్ :మద్యం తాగడం, జూదం ఆడడం లాంటి వ్యసనాలకు బానిసగా మారాడు.దీంతో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఉదయంపూట ఇడ్లీలు అమ్మడం, రాత్రిపూట దొంగతనాలుచేస్తూ జల్సాలకు డబ్బులను సంపాదిస్తున్నాడు. ఎట్టకేలకు పంజగుట్ట పోలీసులు ఈ దొంగను అరెస్టు చేశారు.
కర్నూల్ జిల్ల ఆళ్ళగడ్డకు చెందిన నాగరాజు పాత నేరస్థుడు. ఇతనిపై ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏడు కేసులున్నాయి. ప్రస్తుతం అమీర్ పేటలోని ఎల్లారెడ్డిగూడలో ఇండ్లీ బండి నడుపుతున్నాడు.

ఉదయం నుండి రాత్రివరకు ఇడ్లీలు అమ్మడం, రాత్రిపూట తాళాలు వేసిన ఇళ్ళు, దుకాణాలకు షట్టర్లు పగులగొట్టి అందినకాడికి దోచుకోవడం నాగరాజుకు అలవాటు.
దొంగతనం ద్వారా సంపాదించిన డబ్బును మద్యం తాగేందుకు జూదం ఆడేందుకు ఉపయోగించేవాడు. జల్సాల కోసమే ఈ డబ్బును ఉపయోగించుకొనేవాడు.
పంజగుట్ట ఠాణ పరిధిలోని ఇండేన్ గ్యాస్ దుకాణం, బ్రిడ్జిస్టోన్ టైర్ల దుకాణంలో రూ.1.30 లక్షలు చోరి చేశాడని పోలీసులు తెలిపారు.
నిందితుడి నుండి బేగంపేట రైల్వేస్టేషన్ సమీపంలో మూడు తులాల బంగారు గొలుసు, రూజ1.30 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. నాగరాజుపై పిడి చట్టాన్ని నమోదు చేయాలని పోలీసులు ఉన్నతాధికారులకు ప్రతిపాదించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications