యువత వేగానికి పోలీసుల చెక్..! నేడు ప్రధాన ఫ్లైఓవర్ల మూసివేత..!!
హైదరాబాద్ : కొత్త సంవత్సరం జోష్ లో స్నేహితులను బైక్ పై ఎక్కించుకుని రివ్వున తేలిపోదాం అనుకునే యువతకు నగర పోలీసులు బ్రేకులు వేయబోతున్నారు. నూతన సంవత్సర హాంగోవర్ లో కాస్త దురుసుగా బైకులు, కార్లు నడిపై యువతను కట్టడి చేయాలనుకుంటున్నారు పోలీసులు. నగరంలో అతి వేగాన్ని నియంత్రించే పోలీసులు నేడు ప్రత్యేకించి మొత్తానికే ఆంక్షలు విధించబోతున్నారు. నగరంలోని ఫ్లైఓవర్లను మూసేవేసి నగర యువత జోష్ చెక్ పెట్టబోతున్నారు నగర పోలీసులు.
నూతన సంవత్సరవేళ ప్రమాదాల నియంత్రణకు హైదరాబాద్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. విచ్ఛలవిడిగా మద్యం తాగి ప్రయాణించి.. రేసులకు పాల్పడేవారిపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. 31వ తేదీ రాత్రి పది గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు హైదరాబాద్లోని అన్ని ఫ్లైఓవర్లపై రాకపోకలు నిషేధించారు. ఆ సమయంలో ఫ్లైఓవర్లకు అడ్డంగా బారీకేడ్లు ఏర్పాటు చేస్తారు.

అంబులెన్సులను మినహా మరే ఇతర వాహనాలను కూడా అనుమతించరు. అయితే.. బేగంపేట ఫ్లైఓవర్పై మాత్రం ఈ ఆంక్షలు ఉండవు. ఈ వంతెన మార్గమే ప్రధాన రహదారి కావడంతో ఆ ఒక్క ఫ్లైఓవర్నే తెరిచి ఉండాలని నిర్ణయించారు. ఇక యువత నూతన సంవత్సర జోష్ తో మేఘాలలో తేలిపోదామనుకుంటే మాత్రం ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిందే..!!
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications