అమీర్పేటలో అర్థరాత్రి 'డ్రగ్స్' కలకలం: ఏడుగురి అరెస్టు.. కూపీ లాగుతున్నారు!
ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని, కోర్టు ముందు ప్రవేశపెట్టి.. ఆపై కస్టడీలోకి తీసుకుంటామని చెప్పారు.
హైదరాబాద్: రాజధానిలో కలకలం రేపిన డ్రగ్స్ దందాపై పోలీసులు లోతుగా నిఘా పెట్టారు. నగరవ్యాప్తంగా డ్రగ్స్ మూలాలను గుర్తించడానికి తమ వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో అమీర్పేటలోని మైత్రివనం వద్ద మరో డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
విస్తుపోయే నిజాలు: పోర్న్ మార్కెట్ లోను డ్రగ్స్ ముఠా.. అమ్మాయిల నగ్న చిత్రాలతో!
గురువారం అర్థరాత్రి అందిన సమాచారంతో.. మైత్రీవనం వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసినట్లు సమాచారం. దాడుల్లో 2.5 కిలోల అల్ఫ్రాజోలం, అరకిలో డైజోఫామ్ను వారు స్వాధీనం చేసుకున్నారు. వాటిని విక్రయిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని, కోర్టు ముందు ప్రవేశపెట్టి.. ఆపై కస్టడీలోకి తీసుకుంటామని చెప్పారు. ఎవరెవరికి వారు మాదకద్రవ్యాలను సప్లయ్ చేస్తున్నారన్న దానికి సంబంధించి వారి ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. కాగా, పట్టుబడ్డ వారంతా సిద్దిపేటకు చెందినవారుగా గుర్తించారు. బాన్సువాడలో ఓ వ్యక్తి నుంచి డ్రగ్స్ తీసుకుని.. వాటిని హైదరాబాద్ లోని మరో వ్యక్తికి ఇచ్చేందుకు వచ్చారని పోలీసులు తెలిపారు.