అమీర్పేటలో అర్థరాత్రి 'డ్రగ్స్' కలకలం: ఏడుగురి అరెస్టు.. కూపీ లాగుతున్నారు!
ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని, కోర్టు ముందు ప్రవేశపెట్టి.. ఆపై కస్టడీలోకి తీసుకుంటామని చెప్పారు.
హైదరాబాద్: రాజధానిలో కలకలం రేపిన డ్రగ్స్ దందాపై పోలీసులు లోతుగా నిఘా పెట్టారు. నగరవ్యాప్తంగా డ్రగ్స్ మూలాలను గుర్తించడానికి తమ వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో అమీర్పేటలోని మైత్రివనం వద్ద మరో డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
గురువారం అర్థరాత్రి అందిన సమాచారంతో.. మైత్రీవనం వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసినట్లు సమాచారం. దాడుల్లో 2.5 కిలోల అల్ఫ్రాజోలం, అరకిలో డైజోఫామ్ను వారు స్వాధీనం చేసుకున్నారు. వాటిని విక్రయిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని, కోర్టు ముందు ప్రవేశపెట్టి.. ఆపై కస్టడీలోకి తీసుకుంటామని చెప్పారు. ఎవరెవరికి వారు మాదకద్రవ్యాలను సప్లయ్ చేస్తున్నారన్న దానికి సంబంధించి వారి ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. కాగా, పట్టుబడ్డ వారంతా సిద్దిపేటకు చెందినవారుగా గుర్తించారు. బాన్సువాడలో ఓ వ్యక్తి నుంచి డ్రగ్స్ తీసుకుని.. వాటిని హైదరాబాద్ లోని మరో వ్యక్తికి ఇచ్చేందుకు వచ్చారని పోలీసులు తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications