నీటి కష్టాలకు హరీష్ రావే కారణం: పొన్నం, హెచ్సియుపై విహెచ్
హైదరాబాద్: నారాయణఖేడ్లో నీటి ఎద్దడికి మంత్రి హరీష్ రావు కారణమని మాజీ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు నాయకుడు పొన్నం ప్రభాకర్ విమర్శిచారు సింగూరు రిజర్వాయర్ నుంచి నీటిని మెదక్కు తరలించారని ఆయన బుధవారం మీడియాతో చెప్పారు
నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్ను దత్తత తీసుకుంటానని హరీష్ రావు ప్రకటించడం ఆ నియోజకవర్గం ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఏకగ్రీవం చేసే సంప్రదాయానికి టీఆర్ఎస్ తిలోదకాలు ఇచ్చిందని పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కిష్టారెడ్డి బతికి ఉన్నప్పుడు ప్రభుత్వం నారాయణ్ఖేడ్ వైపు చూడలేదన్నారు. ఎన్నికల్లో లబ్ది కోసమే భారీగా నిధులు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. సింగూరు జలాలను ఘన్పూర్కు తరలించడం వల్లే నారాయణఖేడ్లో నీటి సమస్య తీవ్రమైందని పొన్నం ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే, హెచ్సీయూలో ఏబీవీపీ ఆధిపత్యం పెరుగుతోందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు ధ్వజమెత్తారు. ఏబీవీపీ పూర్వ నాయకుడు శ్రీనివాస్రెడ్డిని హెచ్సీయూ బోర్డులో సభ్యుడిగా ఎలా నియమిస్తారని ఆయన బుధవారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు.
ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేదంటే యూనివర్సిటీలో యుద్ధాలు మొదలవుతాయని ఆయన హెచ్చరించారు. నిమ్స్లో పరిస్థితి దారుణంగా తయారైందని హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications