MAA వివాదం:మేము విజన్తో వచ్చాం.. డివిజన్ కోసం కాదు: ప్రకాష్ రాజ్కు నరేష్ కౌంటర్..నాగబాబుపై అలా..!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ "మా" ఎన్నికలు రక్తికడుతున్నాయి. శుక్రవారం రోజున ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టి లోకల్ - నాన్లోకల్ అంశం గురించి స్పష్టం చేసిన నేపథ్యంలో శనివారం రోజున మా అధ్యక్షుడు నరేష్ కౌంటర్ ఇచ్చారు. సినీ పరిశ్రమలో ఉన్న వారు ఎవరైనా సరే పోటీ చేయొచ్చని చెప్పారు. ఇప్పటి వరకు తామెప్పుడు లోకల్-నాన్ లోకల్ ఇష్యూను తీసుకురాలేదని చెప్పారు. ప్రకాష్ రాజ్ మంచి నటుడు కావడమే కాదు తనకు మంచి మిత్రుడని చెప్పుకొచ్చిన నరేష్... తాను ఎన్నికల గురించి మూడు నెలల క్రితమే తనతో చెప్పినట్లు గుర్తు చేశారు. అయితే ఎన్నికల నిర్వహణకు సెప్టెంబర్ వరకు గడువు ఉందని తాను చెప్పినట్లు నరేష్ వెల్లడించారు.
Recommended Video

మేమే చేసిన పనులు ఇవే
ఇక తమ హయాంలో ఏం చేశారో నరేష్ చెప్పుకొచ్చారు. పెన్షన్లను 800శాతం మేరా పెంచామని చెప్పారు. ఇక పలువురికి ఆర్థిక సహాయం చేశామని చెప్పారు. అంతేకాదు చాలామందికి ఇన్ష్యూరెన్స్లు కూడా చేయించామని వెల్లడించిన నరేష్... కరోనా కష్టకాలంలో చాలామంది ప్రముఖులు విరాళాలు ఇచ్చారని చెప్పారు. దాదాపుగా రూ.30 లక్షలు విరాళాల రూపంలో వచ్చాయని చెప్పారు. ఇందులో రాజశేఖర్ దంపతులు రూ.10 లక్షలు ఇచ్చారని చెప్పారు. ఇక 728 మందికి జీవిత బీమా కల్పించామని చెప్పిన నరేష్.. రూ.వెయ్యిగా ఉన్న పెన్షన్ను రూ.6వేలకు పెంచామని గుర్తు చేశారు.

నాగబాబు వ్యాఖ్యలు బాధకు గురిచేశాయి
శుక్రవారం రోజున నాగబాబు మాట్లాడిన మాటలు తనకు బాధ కలిగించాయని నరేష్ అన్నారు. మా మసకబారిపోయిందని చెప్పడం బాధాకరమని అన్నారు. ఎన్నో మంచి పనులు చేశామని వాటిని చిరంజీవి సైతం అభినందించారని గుర్తు చేశారు నరేష్. ఇక కరోనా సమయంలో సీసీసీకి లక్ష రూపాయలు వచ్చాయని చెప్పారు. ఇక వృద్ధ కళాకారులకు అవకాశాలు ఇప్పించే ప్రయత్నం చేశామని అయితే కరోనా కారణంగా అవి ఫలించలేదని నరేష్ వెల్లడించారు. తనకు కథలు చెప్పే అలవాటు లేదని.. కేవలం తాను కాగితాలు చూపే మాట్లాడతానని నరేష్ చెప్పారు. కరోనా కష్ట సమయంలో సాయం కోసం 140 మంది దరఖాస్తు చేసుకున్నారని నరేష్ వివరించారు. తాము ఒక విజన్తో వచ్చామని అందరినీ కలుపుకుని పోవడమే తనకు తెలుసునని నరేష్ స్పష్టం చేశారు.

విజన్తో వచ్చాం.. డివిజన్ కోసం కాదు
ఇప్పటి వరకు పనిచేసిన మా అధ్యక్షులందరూ అద్భుతంగా పనిచేశారని కొనియాడారు నరేష్. మా ఒక దిగ్గజ సంస్థ అని దీన్ని కూల్చడం ఎవరి తరం కాదని చెప్పారు. ఇక ఈ సారి మహిళకు ఛాన్స్ ఇవ్వాలన్నదే తమ ఉద్దేశం అని నరేష్ చెప్పారు. ఇక్కడ ఎవరూ పదవుల కోసం పాకులాడటం లేదని.. విజన్తో వచ్చామని నరేష్ పునరుద్ఘాటించారు. ఈ సారి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకే ప్రయత్నిస్తున్నామని తన ఉద్దేశాన్ని చెప్పుకొచ్చారు నరేష్. ఇక కౌంటర్ ఎన్కౌంటర్తో మా లో విబేధాలు ఏ స్థాయికి చేరుతాయో కాలమే సమాధానం చెప్పాలి.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications