హైదరాబాద్ ‘ప్రతిమ’లో కరీనాకు వైద్య పరీక్షలు(పిక్చర్స్)
హైదరాబాద్: బాలీవుడ్ నటులు కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ శనివారం నగరంలో సందడి చేశారు. ప్రతిమ ఆస్పత్రి నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కాగా, ఆమెను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.

కరీనా, సైఫ్
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఆరోగ్య సేవల సంస్థ ప్రతిమ హాస్పిటల్స్.. వరంగల్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రూ.100 కోట్ల పెట్టుబడితో వరంగల్లోని ములుగు రోడ్డులో ఏర్పాటు చేయబోతున్న ఈ ఇన్స్టిట్యూట్ వచ్చే రెండేండ్లలో అందుబాటులోకి రానున్నట్లు ప్రతిమ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ హరిణి బోయినపల్లి తెలిపారు.

ప్రతిమలో కరీనా దంపతులు
హైదరాబాద్లోని కాచిగూడ వద్ద ఏర్పాటుచేసిన ఆస్పత్రికి బాలీవుడ్ జంట కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ శనివారం ప్రారంభించారు. కరీనా కపూర్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

కరీనా కపూర్
అనంతరం హరిణి మాట్లాడుతూ.. ఇప్పటికే హైదరాబాద్లో రెండు, కరీంనగర్లో ఒక హాస్పిటల్ ఏర్పాటుకు రూ.200 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. ఈ మూడు దవాఖానలు 1,500 పడకల సామర్థ్యం కలిగి ఉన్నట్లు ఆమె వెల్లడించారు.

ప్రతిమ ఆస్పత్రి
వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే ఐదేండ్లలో ప్రతి జిల్లా కేంద్రంలో 50 నుంచి 100 పడకల సామర్థ్యంతో హాస్పిటల్స్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు, ఇందుకోసం సంస్థ రూ.350 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

సైఫ్ అభివాదం
ప్రతిమ హాస్పిటల్స్ ప్రచారకర్తలుగా బాలీవుడ్ జంట సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా సైఫ్ మాట్లాడుతూ..సామాన్యుడికి సైతం తక్కువ ఖర్చుకే ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రతిమ ముందుకురావడం హర్షణీయమన్నారు.

కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్
ఇకనుంచి ఏర్పాటుచేయబోయే ఆస్పత్రుల్లో డాక్టర్లను కూడా భాగస్వామ్యులుగా చేయనున్నట్లు తెలిపారు. కాచిగూడ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు 30% వాటా కల్పించామన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications