రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లి పర్యటనలో అపశృతి: హెలికాప్టర్ గాలికి ఎగిరిపడిన ఏసీపీ, పోలీసులు
యాదాద్రి భువనగిరి: పోచంపల్లి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. చేనేత కళాకారులు దేశ వారసత్వాన్ని కాపాడాలని, వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. చేనేత కార్మికులు సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పర్యటించారు.
President Droupadi Murmu visited handloom and spinning unit and interacted with Ikat handloom weavers in Pochampally Village of Telangana. pic.twitter.com/TX6FaC5TjT
— President of India (@rashtrapatibhvn) December 20, 2023
పోచంపల్లిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను, పోచంపల్లి టై అండ్ డై, ఇక్కత్ చీరల తయారీ, చేనేత మగ్గాలను, స్టాల్స్ను, చేనేత ఔన్నత్యం ప్రతిబింబించే థీమ్ పెవిలియన్ ను సందర్శించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. పోచంపల్లి చేనేత కళాకారులతో మాట్లాడం చాలా సంతోషంగా ఉందన్నారు. పోచంపల్లి వస్త్రాలకు మంచి గుర్తింపు ఉందన్నారు.

ఈ ప్రాంతానికి వచ్చి చీరలు నేసే విధానాన్ని చూడటం సంతోషంగా ఉందని రాష్ట్రపతి ముర్ము తెలిపారు. చేనేత కళను భావితరాలకు అందించడానికి కళాకారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పోచంపల్లి కార్మికుల సమస్యలను, సలహాలను పరిగణలోకి తీసుకుని తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తమ ప్రాంతం నుంచి కొందరిని పోచంపల్లి తీసుకువచ్చి ఇక్కడ కళను వారికి నేర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రపతి పర్యటనలో అపశృతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లి పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో గాలికి ఎగిరిపడ్డారు పోలీసులు. ఈ ఘటనలో ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీకి చెయ్యి విరగగా, ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్పగాయాలయ్యాయి. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications