ప్రధాని మోడీ పర్యటన... ఆ ప్రకటనపైనే అందరిలో ఉత్కంఠ!!
ఎన్నికల సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన పర్యటన పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ పర్యటనలో ఎల్బీ స్టేడియంలో జరిగే బీసీ ఆత్మగౌరవ సభలో ప్రసంగించనున్న కారణంగా మోడీ ఒక ప్రకటన చేస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ బిసి ఆత్మగౌరవ సభలో ఏం చెప్పబోతున్నారు? దాని ప్రభావం ఎన్నికల పైన ఏవిధంగా ఉండబోతుంది? అన్నది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్న ప్రధానమంత్రి, LB స్టేడియంలో జరిగే BC ఆత్మ గౌరవ సభలో ప్రసంగించనున్నారు.

BJP ఎన్నికలలో విజయం సాధిస్తే BC నాయకుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తామని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అమిత్ షా ఇప్పటికే ప్రకటించటంతో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటిస్తారా అన్న అంశంపైఅంతటా ఆసక్తి నెలకొంది. ఇలా ఉండగా, ప్రధానమంత్రి రాక నేపధ్యంలో ఆయన కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో ఈ సాయంత్రం వాహనాల రాకపోకలను పోలీసులు ఇతర మార్గాలకు మళ్ళించారు.
ఇప్పటికే ప్రధాన మంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని భద్రత చర్యలు చేపట్టిన అధికారులు, సాయంత్రం ట్రాఫిక్ దారి మళ్లింపు లను విధించారు. ఇక నరేంద్ర మోడీ ఆత్మగౌరవ సభకు హాజరుకానున్న నేపథ్యంలో లక్ష మంది వరకు జన సమీకరణ చేసి ఈ సభను సక్సెస్ చేయాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆ పనిలో నిమగ్నమైంది.
ఇలా ఉండగా మూడు రోజుల తర్వాత, ఈ నెల 11 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో సారి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా బిజెపి భావిస్తున్న క్రమంలో బిజెపి జాతీయ నాయకత్వం కూడా ప్రచారంపై ఫోకస్ పెడుతుంది. అందులో భాగంగానే ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు.
-
బిగ్ షాక్ : తెలంగాణలో ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్ -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం











Click it and Unblock the Notifications