Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ వచ్చేందుకు ఎదురుచూస్తున్నా..: ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్, ఆ రెండు కార్యక్రమాల్లోనూ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్ రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పర్యటనపై మోడీ ట్వీట్ చేశారు. హైదరాబాద్ నగరంలో రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు మోడీ వెల్లడించారు.

Recommended Video

    World’s Second Largest Statue Of Saint Ramanujacharya In Hyderabad By PM Modi | Oneindia Telugu

    ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్నారు. పటాన్‌చెరులోని ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజాచార్య విరాట్ విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. కాగా, ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొననున్నారు.

    మొదట శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలుకుతారు. ఆయన వెంట హెలికాప్టర్‌లో ఇక్రిశాట్‌కు, అనంతరం ముచ్చింతల్ ఆశ్రమంలోని శ్రీరామానుజ స్వామి సహస్రాబ్ది సమారోహంలో పాల్గొంటారు. ప్రధాని కార్యక్రమాలన్నింటిలో పాల్గొనడంతోపాటు ఆయన విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో వీడ్కోలు పలికే వరకూ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని మోడీ వెంట ఉంటారు.

    prime minister Narendra Modi tweet on Hyderabad tour

    కాగా, ప్రపంచ ప్రఖ్యాత మెట్ట పంటల పరిశోధన సంస్థ "ఇక్రిశాట్" ఏర్పాటై ఈరోజుకు యాభై ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవాలలో ప్రధానిపాల్గొని నూతన లోగోను ఆవిష్కరించి, అక్కడి శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు.

    పటానుచెరులో 1972‌లో ఏర్పాటైన ఇక్రిశాట్ సంస్థ 3,434 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రధానంగా ఇక్కడ కంది,జొన్న, వేరుసెనగ, సెనగ,సజ్జలు లాంటి వంద రకాల వంగడాలను ఆవిష్కరించింది. అంతేగాక, ఇటీవల కొత్తగా పోషకాహార భద్రత కల్పించే వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాలపై పరిశోధనలు చేస్తోంది. ఇక్రిశాట్‌ను పటానుచెరు లోనే ఏర్పాటు చేయడం వెనుక జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో కసరత్తు జరిగింది.

    రైతులకు మేలైన విత్తనాలు, నూతన సాగు రీతులను దగ్గరచేస్తూ ఆసియా,ఆఫ్రికా ఖండాలలో ఆహార సంక్షోభ నివారణకు ఈ పరిశోధనా సంస్థ ఎంతగానో సహాయపడుతోంది. రైతులకోసం ప్రత్యేకంగా అదీ అంతర్జాతీయ స్థాయిలో సంస్థలు ఉన్నాయంటే మొదటిగా వినిపించేది "ఇక్రిశాట్" పేరే. సైన్స్ విత్ హ్యుమన్ ఫేస్ నినాదంతో యాభై అయిదు దేశాల రైతులకు అండగా నిలుస్తోంది. ఇక్కడ మానవాళి మనుగడకు మేలు చేసే అనేక పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+