దమ్ముంటే టీఆర్ఎస్ తెలంగాణలో మూడోసారి గెలిచి చూపించాలి: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఛాలెంజ్
బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన పై, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి హరీష్ రావు తనపై, బీజేపీ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు ప్రచారంలో హరీష్ రావు స్థాయిని దిగజార్చుకుంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు.
Recommended Video

హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడిన రఘునందన్ రావు
దుబ్బాక నియోజక వర్గంలో 57 వేల ఇళ్లలో పెన్షన్ ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పిన వ్యాఖ్యలు అబద్ధమని రఘునందన్ రావు పేర్కొన్నారు.
దుబ్బాక నియోజక వర్గంలో ఉన్న మొత్తం ఇళ్ళు 50,000 అయితే, 57 వేల ఇళ్లలో ఎలా పెన్షన్ ఇస్తున్నారో చెప్పాలని రఘునందన్ రావు నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన సమయంలో ఆదాయం ఎంత, ఖర్చు ఎంత.. ప్రస్తుతం ఆదాయమెంత? ఖర్చు ఎంత అనేది మంత్రి చెప్పగలరా అని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.

రాష్ట్ర ఆదాయ, వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలి
దమ్ముంటే తెలంగాణ, ఆదాయ వ్యయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. దుబ్బాక నియోజకవర్గం లో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే కాకుండా ఎవరు తిరగాలో చెప్పాలని ప్రశ్నించిన రఘునందన్ రావు, ఎమ్మెల్యే రిబ్బన్ కత్తిరించడానికి మాత్రమే తిరుగుతున్నాడు అని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి అన్నారు. దుబ్బాక ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ఇంకా టీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు.

గెలవకుంటే దుబ్బాకను అభివృద్ధి చెయ్యరా? ప్రశ్నించిన రఘునందన్ రావు
టిఆర్ఎస్ గెలవకుంటే దుబ్బాకను అభివృద్ధి చెయ్యరా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఇది సంస్కృతి కాదంటూ మండిపడ్డారు. ప్రజలు కట్టిన పన్నులతోనే సంక్షేమ పథకాలు అందిస్తూ, అదేదో తాము చేసినట్టు గొప్పలు చెప్పుకోవడం ఎందుకంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు. మూడు సంవత్సరాల నుంచి సీఎం కేసీఆర్ చదువుకున్న స్కూలు కూడా అభివృద్ధి లేక అలానే ఉందని, అభివృద్ధి చేసి దమ్ముంటే సీఎం తో ప్రారంభించాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు.

దమ్ముంటే తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి గెలిచి చూపించాలి : రఘునందన్ రావు సవాల్
టిఆర్ఎస్ నాయకులు దమ్ముంటే తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి గెలిచి చూపించాలని రఘునందన్ రావు ఛాలెంజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇస్తున్నా, కేంద్ర సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా చేస్తున్నారని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని రఘునందన్ రావు స్పష్టం చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications