కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్గా రామప్ప అభివృద్ది... ప్రణాళికలు సిద్దం చేయాలని మంత్రి ఆదేశాలు
కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించేలా అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఉట్టిపడే రామప్ప దేవాలయానికి ఇటీవలే యునెస్కో గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. ప్రపంచం మెచ్చిన ఈ ఆలయాన్ని గడిచిన ఏడేళ్లుగా తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలున్నాయి. దీనిపై సుమోటో కేసు స్వీకరించిన హైకోర్టు ఇకనైనా ఆలయాన్ని సంరంక్షించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్గా రామప్ప దేవాలయం,దాని అనుబంధ చారిత్రక కట్టడాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ రామప్ప ఆలయంపై శుక్రవారం(జులై 30) సమీక్షా సమావేశం నిర్వహించారు.
రామప్ప దేవాలయంతో పాటు దాని అనుబంధ కట్టడాలను సరంక్షించేలా,కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్గా ఆ ప్రదేశాన్ని అభివృద్ది చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించడం పట్ల ప్రభుత్వం తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. యునెస్కో మార్గదర్శకాల ప్రకారం సమర్పించాల్సిన సమగ్ర నివేదిక రూపకల్పనపై అధికారులతో చర్చించారు. నివేదిక రూపొందించిన తర్వాత సీఎం కేసీఆర్తో దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

గడిచిన ఏడేళ్లలో రామప్ప ఆలయ సంరక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ కరువవడంతో ఇక్కడి పలు కట్టడాలు పాకురుపట్టిపోగా.. కొన్ని కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. 2012లో చివరిసారిగా ఈ ఆలయాన్ని కెమికల్స్తో శుభ్రం చేశారు. ఆ తర్వాత మళ్లీ దాన్ని పట్టించుకోలేదు. తాజాగా రామప్పకు యునెస్కో గుర్తింపు లభించడంపై ప్రభుత్వం ఇప్పుడు అటువైపు దృష్టి సారించింది.
వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో రూల్ 22.7 ద్వారా యునెస్కో గుర్తింపు కోసం రామప్పను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో భారత్కు రష్యా సహకరించింది. మొత్తం 17 దేశాల ఆమోదం తెలపడంతో రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చింది. యునెస్కో చారిత్రక కట్టడాల జాబితాలో ఇప్పటివరకూ 167 దేశాల నుంచి 1121 కట్టడాలు ఉన్నాయి.
Recommended Video
ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో ఉన్న రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చాలాకాలంగా కృషి చేస్తూ వచ్చాయి. ఈ ఆలయానికి మొత్తం 20 అనుబంధ ఆలయాలు ఉన్నాయి. రామప్ప విశిష్ఠతను అంతర్జాతీయంగా చాటి చెప్పేలా కేంద్రం ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఈ బృందం 24 దేశాలకు రామప్ప విశిష్ఠత గురించి వివరించింది. ఎట్టకేలకు రామప్ప ఆలయానికి ఇటీవల యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) గుర్తింపు లభించింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications