చిన్నారిపై అత్యాచారం చేసింది మామనే
మెదక్: ముక్కుపచ్చలారని చిన్నారిపై కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా మెదక్ మండలం మంబోజిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మేనత్త భర్తే ఈ దారుణానికి పాల్పడడం సభ్యసమాజాన్ని తలదించించుకునేలా చేసింది.
హైదరాబాదులోని కార్వాన్లో ఉండే మేనత్త భర్త నర్సింలు సోమవారం బావమరిది పిల్లలను సెలవులకు తన ఇంటికి తీసుకెళ్లడానికి మంబోజిపల్లి వచ్చాడు. రాత్రి కావడంతో మరో బావమరిది ఇంటి వద్ద ఆరుబయట నిద్రించాడు. రాత్రి పది గంటలుదాటిన తర్వాత 4వ తరగతి చదువుతున్న చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంటి వెనకకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
అదే సమయంలో అటువైపుగా వెళ్లినవారు బ్యాటరీ లైట్ వెలుతురులో బట్టలు లేకుండా కనిపించడంతో అనుమానంతో దగ్గరికి వెళ్లేసరికి పరారయ్యాడు. చిన్నారిని ఇంట్లోకి తీసుకువచ్చి మహిళలు పరిశీలించగా అత్యాచారం జరిగినట్లు గుర్తించారు.
మెదక్ రూరల్ పోలీసులకు ఫిర్యాదుచేయ గా కేసు నమోదుచేసి చిన్నారిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ గుర్రం వినాయక్రెడ్డి తెలిపారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు.