తల్లిదండ్రులకు శుభవార్త.. మీ చిన్నారుల కోసం త్వరలో సూపర్ స్కీమ్!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలకు వివిధ సంక్షేమ పథకాలను అందిస్తూ భరోసా కల్పిస్తోంది. ఇదే క్రమంలో రేవంత్ ప్రభుత్వం త్వరలోనే చిన్నారుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగానికి ప్రాధాన్యతనిస్తున్న రేవంత్ ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్య మెరుగుదలకు ఈ పథకాన్ని తీసుకురాబోతున్నట్టు సమాచారం.
ఐదేళ్ళ లోపు చిన్నారుల ఆరోగ్య రక్షణకు కొత్త పథకం
బాల భరోసా పేరుతో ఈ కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్, ఈ పథకం ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందించాలని సంకల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా చిన్నారుల అనారోగ్యంతో తల్లడిల్లుతున్న తల్లిదండ్రులకు ఈ పథకం ద్వారా శుభవార్త చెప్పింది. ఐదేళ్లలోపు వయసు ఉన్న వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత వైద్య సేవలను అందించడానికి బాల భరోసా పథకాన్ని తీసుకురానున్నట్టు తెలుస్తోంది.

8 లక్షల మంది చిన్నారులకు అనారోగ్య సమస్యలు
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది నిర్వహించిన సర్వేలో సుమారు 8 లక్షల మంది చిన్నారులు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించిన రేవంత్ సర్కార్ వీరందరికీ ఉచిత వైద్యాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. చిన్నారులలో చాలామంది రక్తహీనత, వినికిడి, దృష్టి లోపాలు, వయసుకు తగిన ఎదుగుదల లేక పోషకాహార లోపాలు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం వీరందరికీ ఉచిత వైద్య భరోసా కల్పించనుంది.
ఉచిత వైద్యం, ఆపరేషన్లు
ఈ పథకం కింద వైకల్యంతో బాధపడే చిన్నారులకు ఉచిత శస్త్ర చికిత్సలు, వినికిడి లోపం ఉన్నవారికి యంత్రాలను అమర్చడంతో పాటు ఇతర వైద్య సేవలను అందించనున్నట్టు తెలుస్తోంది. వైద్య ఆరోగ్యశాఖతో పాటు మహిళా శిశు సంక్షేమశాఖ సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నాయి. దీనిని ఆరోగ్య శ్రీ పథకానికి అనుసంధానం చేయనున్నారు. బాల భరోసా వర్తించని అనారోగ్య సమస్యలకు సీఎం సహాయనిధి నుంచి ఆర్థికసహాయం అందించడానికి కూడా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకంతో కలిపి
అయితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న రాష్ట్రీయ బాల స్వస్త్య పథకాన్ని కూడా బాల భరోసాతో అనుసంధానం చేయనున్నారు. ఈ పథకం సక్రమ అమలు కోసం ఒక కొత్త సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా ప్రతి చిన్నారి వైద్య చరిత్రను ట్రాక్ చేసి, తదనుగుణంగా చికిత్స అందించి, దాని పురోగతిని పర్యవేక్షిస్తారు.
త్వరలోనే ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
మొత్తంగా చిన్నారుల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అమలు చేయాలని భావిస్తున్న బాల భరోసా పథకం త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పథకం సక్సెస్ అయితే రాష్ట్రంలోని లక్షల మంది చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications