అదానీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం!
దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న అదానీ వ్యవహారం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది . అదానీ ఇచ్చే డబ్బులు తెలంగాణ రాష్ట్రానికి వద్దని తేల్చిపారేసింది. యూఎస్ లో అదానిపైన లంచం, మోసం ఆరోపణల కేసు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా గౌతమ్ అదాని అవినీతి అంశం పైన చర్చ జరుగుతుంది. ఈరోజు పార్లమెంటు ఉభయ సభలలో వ్యవహారం పైన చర్చ జరపాలని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పట్టుపట్టి రచ్చ చేశాయి.
అదానీ విషయంలో రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
ఇక ఇదే సమయంలో అదానీ వ్యవహారంలో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అదానీ గ్రూప్ పై ఉన్న తాజా వివాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే అదానీ వ్యవహారంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ ఆదానీతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుందని, బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేస్తుంది.

అదానీ వ్యవహారంపై రేవంత్ రెడ్డి స్పందన
కాంగ్రెస్ హై కమాండ్ కు తెలియకుండానే ఆదానితో ఒప్పందాలు జరిగాయా అంటూ ప్రశ్నిస్తోంది. తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా స్పందిస్తూ సంచలన విషయాలను వెల్లడించారు. అదానీ వ్యవహారానికి సంబంధించి చట్టబద్ధంగా నిర్వహించే టెండర్లలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అయితే స్కిల్ యూనివర్సిటీ కోసం విరాళాలు సేకరించామని చాలా మంది విరాళాలు ఇచ్చారని ఆయన తెలిపారు.
ఆ విరాళం నిరాకరణ.. లేఖ రాశామన్న రేవంత్
అందులో భాగంగానే 100 కోట్ల రూపాయలు అదాని స్కిల్ యూనివర్సిటీ కోసం ఇస్తామని తెలిపారని, అయితే అదాని నుండి ఆ నిధులను నిరాకరిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అదానీ డబ్బు తెలంగాణ రాష్ట్రానికి వద్దని, ఆయన ఇచ్చే 100 కోట్ల రూపాయలను నిరాకరిస్తూ ఆదానికి లేఖ రాశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రస్తుత పరిణామాలతో నిర్ణయం తీసుకున్నామన్న రేవంత్
స్కిల్ ఇండియా యూనివర్సిటీ కోసం ఏ సంస్థ నుండి తాము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, అందులో అదానీ నుంచి కూడా ఒక్క రూపాయి తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదానీపై కేసు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆదానీతో తెలంగాణాకు సంబంధం లేదన్నారు.
ఢిల్లీ పర్యటనపై చేస్తున్న వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్
ఇదే సమయంలో కొంతమంది తన ఢిల్లీ పర్యటన పైన పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నారని తాను ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాను లాలూచీ పనులు చేయడం కోసం ఢిల్లీ వెళ్లడం లేదని, రాష్ట్రానికి రావలసిన నిధులు రాబట్టుకోవడానికి ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానన్నారు. మీ కడుపు మంట, దుఃఖం తనకు తెలుసు అంటూ రేవంత్ రెడ్డి ప్రత్యర్థి పార్టీల నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ హయాంలో అదానీతో చాలా ఒప్పందాలు చేసుకున్నారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి .అదానికి కాంట్రాక్టులు, భూములు ఇచ్చింది వాళ్లేనని టార్గెట్ చేశారు.
-
ప్రతీ కుటుంబానికి రూ 5 లక్షలు ఉచితంగా, బడ్జెట్ లో భట్టి ప్రకటన - అమలు ఇలా..!! -
బడ్జెట్ లో కొత్త పథకాలు: వీరికి భారీగా లబ్ది - అమలు ముహూర్తం..!! -
ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వం.. రివిజన్, ఫ్యాబ్రికేటెడ్ బడ్జెట్: కవిత ధ్వజం -
తెలంగాణ బడ్జెట్ లో కొత్త పథకాలు, శాఖల వారీ కేటాయింపులు..!! -
భట్టి బడ్జెట్ తో ఉద్యోగులకు దక్కిందేంటి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు












Click it and Unblock the Notifications