Revanth Reddy: పోలీసు నియామాకాల్లో EWS రిజర్వేషన్ అమలు చేయాలని రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..
పోలీసు రిక్రూట్ మంట్ బోర్డు నిర్వహించిన పరీక్షలో ఈడబ్ల్యూఎస్ కోటా వారికి జరుగుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. టీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర నిరాశే మిగిలిందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని విశ్వసించిన యువతకు మొండిచేయి చూపించారని అన్నారు. ఇదిగో నోటిఫికేషన్లు, అదిగో నోటిఫికేషన్లు అంటూ ఊరించడం తప్ప ఉద్యోగాలు భర్తీ చేసిందేమీలేదని లేఖలో పేర్కొన్నారు. ఇదిగో నోటిఫికేషన్లు, అదిగో నోటిఫికేషన్లు అని ఊరించడం తప్ప ఉద్యోగాలు భర్తీ చేసింది లేదన్నారు.
కటాఫ్ మార్కులు
స్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్న రేవంత్ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 20 శాతం, బీసీ అభ్యర్థులకు 25 శాతం కటాఫ్ మార్కులుగా నిర్ణయించారన్నారు.అయితే EWS అభ్యర్థుల కటాఫ్ మార్కులను మాత్రం నిర్ణయించలేదని, అసలు EWS కోటానే పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు. అసలు ఈడబ్ల్యూఎస్ కోటానే పరిగణనలోకి తీసుకోలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీని ద్వారా 15 వేల మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేశారు.

నవంబర్ 10
ప్రిలిమినరీ పరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్థులు తమ సర్టిపికేట్లతో ఫిజికల్ టెస్టు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి నవంబర్ 10 చివరి తేదీ అని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో నష్టపోతున్న అభ్యర్థులు ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చి న్యాయం చేయాల్సిందిగా కోరారని ఆయన లేఖలో పేర్కొన్నారు. తాజా తీర్పునకు అనుగుణంగా రిజర్వేషన్లు నిర్ణయించాల్సిన బాధ్యతప్రభుత్వం పై ఉందన్నారు. దీనిపై కేసీఆర్ ప్రభుత్వం దిగి రాకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications