వైఎస్, కేవీపీ తరానికొక్కరు-ఇప్పుడంతా కుర్చీ..! రేవంత్ సంచలనం..!
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి హెలికాఫ్టర్ ప్రమాదంలో హఠాన్మరణం పాలైన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుంగు అనుచరుడు కేవీపీ రామచంద్రరావును ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. వారిద్దరిని ఆకాశానికెత్తేస్తూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ ఇద్దరు నేతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఇవాళ వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వైెఎస్సార్ స్మారక అవార్డుల ప్రదానం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా వారిద్దరూ ఎలాంటి వారో గుర్తుచేసుకున్నారు. ఈ తరానికి వైఎస్ ఒక్కరే, కేవీపీ ఒక్కరే అంటూ వారిని ఆకాశానికెత్తేశారు. కేవీపీలాంటి వారు తనకు ఎక్కడా కనిపించలేదన్నారు. కేవీపీలా ఉండాలంటే సర్వం త్యాగం చేయాలన్నారు. కొందరు తన దగ్గరకు కేవీపీలా ఉంటామని వస్తారని, ఎవరినైనా మొదటివారం లోపలికి రానిస్తే.. రెండో వారం తన కుర్చీలో కూర్చుంటానంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుభవంతో ఈ విషయం చెబుతున్నట్లు తెలిపారు.

అధికారంలో ఉన్నప్పుడు చాలామంది మిత్రులు వస్తారని, అధికారం మాయమైనప్పుడు మిత్రులు మాయమైపోతూ ఉంటారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ కేవీపీ.. చదువుకునే రోజుల నుంచి వైఎస్ మరణం వరకు తోడుగా ఉన్నారన్నారు. వైఎస్ ఆలోచనలు కేవీపీ కొనసాగిస్తున్నారని సీఎం రేవంత్ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. వైఎస్సార్ సైతం ఆరోపణలు తనపై వేసుకుని, మంచి జరిగితే ఆ క్రెడిట్ కేవీపీకి ఇచ్చిన గొప్ప వ్యక్తి అన్నారు. స్నేహానికి, పాలనకు వైఎస్సార్ నిలువెత్తు నిదర్శనమని, ఆయన స్ఫూర్తితోనే తాము ఆయన ఆశయాలతో పాలన కొనసాగిస్తున్నట్లు రేవంత్ తేల్చేశారు.

వైఎస్సార్ రైతుల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, సీఎంలు మారినా ఆయన పథకాలు మార్చే సాహసం చేయని విధంగా వాటికి ఆయన రూపకల్పన చేశారని రేవంత్ గుర్తుచేశారు. వైఎస్సార్ స్ఫూర్తితోనే తాము ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, సన్నబియ్యం పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో వైఎస్ హామీ ఇచ్చిన తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ఆయన ఆలోచనలకు అనుగుణంగానే నిర్మించి తీరుతామని రేవంత్ మరో సంచలన ప్రకటన చేశారు.
-
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications