నన్ను తిడితే జాబ్, మీడియాలో నా వార్తలు తగ్గాయి.. కేసీఆర్ వల్లే: రేవంత్
హైదరాబాద్: తనను తిట్టిన వారికి ఉద్యోగాలు వస్తున్నాయని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం నాడు అన్నారు. శాసన సభ సమావేశాల అనంతరం మంగళవారం నాడు ఆయన విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడారు.
తనను తిట్టిన వాళ్లకు తెలంగాణలో ఉద్యోగాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. పాతూరి సుధాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి వారికి ప్రమోషన్లు వచ్చాయని చెప్పారు. మరో వ్యక్తికి పీఆర్వోగా ఉద్యోగం వచ్చిందన్నారు.
కేసీఆర్ మనిషేకాదు: రేవంత్ రెడ్డి అరెస్ట్, వారు సిగ్గుపడ్తున్నారు: సుమన్
కొత్త జిల్లాల ఏర్పాటు సరిగా లేదని విమర్శించారు. మీడియాలో తన వార్తలు తగ్గుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం కావాలనే తగ్గించే ప్రయత్నం చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు.
స్పీకర్తో రేవంత్ భేటీ
స్పీకర్ మధుసూదనా చారితో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటయ్యలు సమావేశమయ్యారు. అసెంబ్లీలో తమ చాంబర్ను యథావిధిగా కొనసాగించాలని వినతిపత్రం ఇచ్చారు. ఉదయం ఇదే విషయమై రేవంత్, సండ్రలు స్పీకర్ను కలిశారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత కలవాలని సూచించగా, వారు మళ్లీ కలిశారు.