రేవంత్కు షాక్: టీఆర్ఎస్ లోకి అనుచరులు.. 30వాహనాల్లో హైదరాబాద్కు
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కొడంగల్ చుట్టే తిరుగుతున్నాయి. పార్టీ మారిన రేవంత్కు కొంతమంది అనుచరులు మద్దతుగా నిలబడగా.. మరికొంతమంది మాత్రం షాక్ ఇస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కొడంగల్ చుట్టే తిరుగుతున్నాయి. పార్టీ మారిన రేవంత్కు కొంతమంది అనుచరులు మద్దతుగా నిలబడగా.. మరికొంతమంది మాత్రం షాక్ ఇస్తున్నారు.
తాజాగా కోస్గి మండల పరిషత్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దోమ రాజేశ్వర్ లు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం తమ అనుచరులతో కలిసి 30వాహనాల్లో వారు హైదరాబాద్ బయలుదేరినట్టు సమాచారం.

బుధవారం సాయంత్రం తెలంగాణ భవన్ లో వీరు టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. కార్యక్రమంలో పలువరు మంత్రులు పాల్గొనే అవకాశం ఉంది. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో టీఆర్ఎస్ కొడంగల్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
ఒకవేళ ఉపఎన్నిక వస్తే రేవంత్ ను ఓడించడం ద్వారా తమ బలాన్ని మరింత పెంచుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇందుకోసం భారీగానే కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపడంతో.. కొడంగల్ నుంచి టీఆర్ఎస్ లోకి వలసలు ఊపందుకున్నట్టు కనిపిస్తున్నాయి.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications