దేశంలోనే మొదటి హోంమంత్రి... తెలంగాణ మొదటి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి రికార్డ్...!
Recommended Video
దేశంలో మొట్టమొదటి మహిళ హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించి చరిత్ర సృష్టించిన పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ మొదటి మహిళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరో చరిత్ర సృష్టించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సబితా ఇంద్రారెడ్డి ప్రస్థుతం మహేశ్వరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపోంది మంత్రిబాధ్యతలు స్వీకరించారు.

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సబితా
టీడీపీ నేత,మాజీ మంత్రి అయిన పీ.ఇంద్రారెడ్డి మరణంతో 2000 సంవత్సరంలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మొదటిసారిగా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం చేవెళ్ల నియోజవర్గం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో 2014లో ఆమే మహేశ్వరం స్థానం నుండి పోటీ చేసి మూడవసారి విజయం సాధించారు. అయితే 2004లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో గనుల శాఖ మంత్రిగా బాద్యతలు నిర్వహించారు. అనంతరం 2009 మరోసారి గెలిచిన ఆమే దేశంలోనే మొదటి మహిళ హోంమంత్రిగా బాద్యతలు చేపట్టారు.

తెలంగాణ మొదటి మహిళ మంత్రిగా చరిత్ర
ఇక 2014 ఎన్నకల్లో తిరిగి మహేశ్వరం నుండి పోటీ చేసిన ఆమే మొదటిసారి ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం ఇటివల జరిగిన 2018 ఎన్నికల్లో తిరిగి ఆమే మహేశ్వరం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి గెలుపోందారు.మే 5 1963లో ప్రస్తుత వికారాబాద్ జిల్లాలో జన్మించిన ఆమేకు ముగ్గురు సంతానం ఉన్నారు. కాగా తన కుమారుడికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించకపోవడంతో అసంతృప్తిగా ఉన్న సబితా కొద్ది రోజుల క్రితమే టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు.కాగా గతంలో మొదటి మహిళ హోంమంత్రిగా భాద్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించిన ఆమే తిరిగి తెలంగాణ రాష్ట్రంలోని మొదటి మహిళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి మరో రికార్డు సృష్టించారు

12 మందిలో ఒక్కరికి మంత్రిపదవి
రంగారెడ్డి జిల్లో కాంగ్రెస్ పార్టీని నిర్విర్యం చేయడంలో భాగంగా ఆమేను టీఆర్ఎస్ పార్టీలోకి సీఎం కేసిర్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతోపాటు పార్టీ చేరిక సమయంలోనే మంత్రిపదవి హమీ ఇచ్చారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఇక గ్రేటర్లో కూడ జిల్లా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉండడంతో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఆహ్వానించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుండి 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి చేర్చుకున్న సీఎం సబితా ఇంద్రారెడ్డికి అవకాశం కల్పించారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications